Nov 17, 2020, 10:50 AM IST
బిజెపి నేత, దుబ్బాక ఎమ్మెల్యే పై సంచలన ఆరోపణలు చేసిన రాధా రమణి ఆత్మహత్యాయత్నం చేసింది. రఘునందన్ రావు తో పాటు పలువురు తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అత్యాచారం కేసులో తనకు న్యాయం చెయ్యడంలేదంటూ ఆవేదనతో మాత్రలు మింగి అత్మహత్యాయత్నం చేసింది. రహస్యంగా చికిత్స చేయించి ఇంటి దగ్గర దించిన ఆర్సి పురం పోలీసులు. రాధా రమణి పఠాన్ చెరు ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది.