ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన జన ఔషధి దివస్ సందర్భంగా తెలంగాణలోని గజ్వెల్ పట్టణంలో జనరిక్ మెడికల్ షాప్ను మెదక్ ఎంపీ రఘునందన్ రావు సందర్శించారు. జనరిక్ మందులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలకు తక్కువ ధరకు అత్యుత్తమమైన ఔషధాలు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రధాన్ మంత్రి భారతీయ జనౌషధి పరియోజన (PMBJP) ప్రాముఖ్యతను వివరించారు.