వేములవాడ పోలీస్ స్టేషన్లో ఏసిబి దాడి... ఆరువేల లంచంతో అడ్డంగా బుక్కైన హెడ్ కానిస్టేబుల్

Aug 18, 2022, 4:44 PM IST


కరీంనగర్ : ప్రజలకు రక్షణ కల్పిస్తూ... అక్రమాలను అరికట్టాల్సిన పోలీసే అవినీతి బాట పట్టాడు. ఇలా లంచాలకు బాగా అలవాటు పడ్డ ఓ పోలీస్ ఏసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పోలీస్ స్టేషన్లో ఇవాళ ఏసీబీ దాడులు చేపట్టింది. హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ 6000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఒక్కసారిగా ఏసిబి అధికారులు దాడిచేసి సదరు అవినీతి పోలీసును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.