
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, పలువురు ముఖ్యమంత్రులు హాజరయ్యారు. 2027 ఫిబ్రవరి 9 వరకు సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ కొనసాగుతారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తొలి హర్యానా వ్యక్తిగా జస్టిస్ సూర్యకాంత్ చరిత్రలో నిలిచారు.