video news : వచ్చే శతాబ్దానికల్లా యేటా పదిహేను లక్షల మరణాలు

video news : వచ్చే శతాబ్దానికల్లా యేటా పదిహేను లక్షల మరణాలు

Siva Kodati |  
Published : Nov 05, 2019, 11:54 AM IST

గ్రీన్ హౌజ్ వాయు ఉద్గారాలు ఇలాగే కొనసాగితే అధిక ఉష్ణోగ్రతల వల్ల వచ్చే శతాబ్దానికి దేశంలో యేటా పదిలక్షల మంది మరణిస్తారని ఓ కొత్త అధ్యయనం అంచనా వేస్తోంది.

గ్రీన్ హౌజ్ వాయు ఉద్గారాలు ఇలాగే కొనసాగితే అధిక ఉష్ణోగ్రతల వల్ల వచ్చే శతాబ్దానికి దేశంలో యేటా పదిలక్షల మంది మరణిస్తారని ఓ కొత్త అధ్యయనం అంచనా వేస్తోంది. 

చికాగో యూనివర్సిటీలోని టాటా సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఇండియాలోని వాతావరణ మార్పుల మీద ఓ పరిశోధన చేసింది. 2100 సం. వచ్చేసరికి దేశంలో యేటా 4 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతుందని అంచనా వేసింది.

అంతేకాదు దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పంజాబ్ కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తేల్చింది. ఇప్పటివరకు దేశంలో అత్యంత వేడిగా ఉండే రాష్ట్రంగా పంజాబ్ నమోదయ్యింది. ఇక్కడ వార్షిక వేసవి ఉష్ణోగ్రత 32 డిగ్రీ సెల్సియస్ గా నమోదవుతుంది.

ఉష్ణోగ్రతలు పెరిగితే దీంతోపాటే వేడి అధికంగా ఉండే రోజులూ పెరుగుతాయని తేలింది. ఈ ప్రభావం ఒడిశా రాష్ట్రంలో ఎక్కువ కనిపించే అవకాశం ఉంది. 2010లో యావరేజ్ గా 1.62  వేడిగా ఉన్న రోజులుంటే 2100నాటికి ఈ యావరేజ్ 48.05 రోజులకు చేరనుంది. ఢిల్లీలో 22 రెట్లు ఎక్కువగా, హర్యానాలో 20 రెట్లు ఎక్కువగా అధికఉష్ణోగ్రతల రోజులు నమోదుకానున్నాయి. 

వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం, మామూలు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2100నాటికి యేటా పదిహేను లక్షల మరణాలకు దారి తీస్తుందని ఈ అధ్యయనం అంచనా వేసింది. 

దేశంలో నేడు రకరకాల ఆరోగ్యకారణాలు, వ్యాధులు, ఇన్ ఫెక్షన్ల వల్ల నమోదవుతున్న మరణాలసంఖ్య కంటే ఇది ఎంతో ఎక్కువ అని తేలింది.

అధిక ఉష్ణోగ్రతల వల్ల ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ..ఈ ఆరు రాష్ట్రాల్లో ఇప్పటికే రెట్టింపు మరణాల సంఖ్య నమోదవుతుంది

11:10PM Modi in Bodo Cultural Programme: బోడో సాంస్కృతిక కార్యక్రమంలో ప్రధాని మోదీ| Asianet News Telugu
04:53West Bengal Rail Revolution: రైల్వే విప్లవానికి కీలక కేంద్రంగా వెస్ట్ బెంగాల్ | Asianet Telugu
11:19PM Modi flags off Vande Bharat sleeper: పట్టాలపై పరుగులు పెట్టిన వందే భారత్ స్లీపర్| Asianet Telugu
16:56Palamedu Jallikattu Begins in Madurai: తమిళనాడులో హోరా హోరీగా జల్లికట్టు| Asianet News Telugu
20:54Jaipur Army Day Parade 2026 | CDS Anil Chauhan | Rajasthan CM Bhajanlal Sharma | Asianet News Telugu
10:12జైపూర్‌లో వీర జవాన్లకు నివాళులు: CDS అనిల్ చౌహాన్, COAS జనరల్ ఉపేంద్ర ద్వివేది | Asianet News Telugu
17:032026 Sankranthi celebrations in Delhi | PM Modi Powerful Pongal Speech | Asianet News Telugu
09:09Makarajyothi: ఘనంగా మకర జ్యోతి ఉత్సవం.. దర్శనానికి పోటెత్తిన లక్షలాది స్వాములు | Asianet News Telugu
15:36Sabarimala Makarajyothi: మకర జ్యోతి దర్శనానికి శబరిమలకు పోటెత్తిన భక్తులు | Asianet News Telugu
04:06Ahmedabad International Kite Festival సంక్రాంతి సంబరాల్లో పతంగ్ లు ఎగరేసిన మోదీ| Asianet News Telugu