మచిలీపట్నంలో హైటెన్షన్... కొల్లు రవీంద్ర బలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు

Mar 11, 2021, 10:09 AM IST

మచిలీపట్నం: తీవ్ర ఉద్రిక్తత నడుమ మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్రను గురువారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ అరెస్ట్ కు ముందు రవీంద్ర నివాసం వద్ద హై టెన్షన్ ఏర్పడింది. రవీంద్రను అరెస్ట్ చేసేందుకు ఆయన నివాసానికి  పోలీసులు చేరుకోగా ఈ విషయం తెలిసి టీడీపీ కార్యకర్తలు కూడా భారీగా చేరుకున్నారు. తమ నాయకుడిని పోలీసులు బలవంతంగా తీసుకువెళుతుండగా వారు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అయితే చివరకు రవీంద్రను అరెస్ట్ చేసిన పోలీసులు వాహనంలో తరలించారు.