ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని తన నివాసంలో జరిగిన దాడి వెనుక మంత్రి నారా లోకేష్ ఆదేశాలే ఉన్నాయని మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎంపీ కేశినేని చిన్ని నేతృత్వంలో టీడీపీ గూండాలు, పోలీసుల సమక్షంలోనే పెట్రోల్ బాంబులతో దాడి చేసి తన కుటుంబాన్ని భౌతికంగా లేకుండా చేయాలన్న కుట్ర చేశారని అన్నారు.