Oct 3, 2022, 11:12 AM IST
విజయవాడ : శరన్నవరాత్రి వేడుకలతో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం కళకళలాడుతోంది. రోజుకో అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇలా నవరాత్రి వేడుకల్లో ఎనిమిదోరోజయిన ఇవాళ(సోమవారం) అమ్మవారు దుర్గాదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. పరాశక్తి అమ్మవారిని దర్శనం కోసం భక్తులు తెల్లవారుజామునుండే ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు.