పార్టీపై కసరత్తు.. షర్మిల మదిలో 11 ప్రశ్నలు

Siva Kodati |  
Published : Feb 20, 2021, 02:40 PM IST
పార్టీపై కసరత్తు..  షర్మిల మదిలో 11 ప్రశ్నలు

సారాంశం

తెలంగాణలో పార్టీ స్థాపన ఏర్పాట్లలో బిజీగా వున్న వైఎస్ షర్మిల.. ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన వారి నుంచి అభిప్రాయ సేకరణ చేపడుతున్నారు షర్మిల. తెలంగాణలోని వివిధ అంశాలపై అభిప్రాయ సేకరణ చేస్తున్నారు

తెలంగాణలో పార్టీ స్థాపన ఏర్పాట్లలో బిజీగా వున్న వైఎస్ షర్మిల.. ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన వారి నుంచి అభిప్రాయ సేకరణ చేపడుతున్నారు షర్మిల. తెలంగాణలోని వివిధ అంశాలపై అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఇందుకోసం 11 ప్రశ్నలతో ఒక ప్రశ్నాపత్రాన్ని రూపొందించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కులాలకు, మతాలకు అతీతంగా తెలుగువారందరినీ వైఎస్ఆర్ ప్రేమించారని షర్మిల గుర్తుచేశారు. తెలంగాణ ప్రజలు వైఎస్ఆర్‌ను గుండెల్లో పెట్టుకున్నారని తెలిపారు. ఆయన కోసం మరణించిన వారిలో తెలంగాణ వారే అధికంగా వున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆ ప్రశ్నలు ఇవే..?

  1. తెలంగాణలో వైఎస్సార్ అభిమానులు ఎదుర్కొంటున్న కష్టాలేంటీ.?
  2. ఈ కష్టాలను ఏ విధంగా పరిష్కరించాలి..?
  3. మీ అసెంబ్లీ పరిధిలో వైఎస్సార్ చేసిన అభివృద్ధి పనులు ఏవి..?
  4. పార్టీ ఏర్పాటు గురించి జనం ఏమనుకుంటున్నారు..?
  5. టీఆర్ఎస్‌ను ఎలా ఎదుర్కోవాలి..?
  6. బీజేపీని ఏ విధంగా ఎదుర్కోవాలి..?
  7. తెలంగాణ ఉద్యమకారులు ఏమంటున్నారు..?
  8. బలమైన ప్రత్యామ్నాయంగా ఏర్పడాలంటే పోరాడాల్సిన అంశాలేంటీ..?
  9. సంస్థాగతంగా బలపడేందుకు చేయాల్సిన పనులేంటీ..?

PREV
click me!

Recommended Stories

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
CM Revanth Reddy Interview: ఇంగ్లీష్ లో ఇంటర్వ్యూ అదరగొట్టిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet Telugu