ఇంట్లో నుంచి పారిపోయి.. హిజ్రాగా మారి..!

By telugu news teamFirst Published Jul 1, 2021, 11:43 AM IST
Highlights

 అతని ఆచూకీ కోసం తల్లిదండ్రులు ఎంత వెతికినా లభించలేదు. ఈ క్రమంలో .. రెండు నెలల తర్వాత యువకుడు.. వేములవాడలో తిరుగుతున్నట్లు సమాచారం అందింది.

రెండు నెలల క్రితం ఇంట్లో నుంచి పారిపోయిన ఓ యువకుడు.. హిజ్రా గా మారి మళ్లీ ఇంటికి చేరాడు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పెద్దపల్లి జిల్లా మంజంపల్లికి చెందిన వి.మహేష్ అనే యువకుడు రెండు నెలల క్రితం ఇంటి నుంచి పారిపోయాడు. అతని ఆచూకీ కోసం తల్లిదండ్రులు ఎంత వెతికినా లభించలేదు. ఈ క్రమంలో .. రెండు నెలల తర్వాత యువకుడు.. వేములవాడలో తిరుగుతున్నట్లు సమాచారం అందింది.

దీంతో.. వెంటనే అతని తల్లిదండ్రులు అక్కడకు చేరి వెళ్లి ఆరా తీశారు. కాగా వేములవాడ పరిసరాల్లోని అగ్రహారం, తిప్పాపూర్, చంద్రగిరి ప్రాంతాల్లో వెతికారు. పట్టణంలోని జాత్రాగ్రౌండ్‌ వద్ద మహేశ్‌ హిజ్రాగా మారి కనిపించాడు. దీంతో.. యువకుడిని ఇంటికి రావాల్సిందిగా తల్లిదండ్రులు బ్రతిమిలాడారు. అయినప్పటికీ.. అతను ఇంటికి రావడానికి నిరాకరించడం గమనార్హం. 

ఈ క్రమంలో హిజ్రాలకు మహేశ్‌ తల్లిదండ్రులకు వాగ్వాదం, తోపులాట జరిగింది. చివరికి మహేశ్‌ కాళ్లు కట్టేసి కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. మంజంపల్లిలో ఆస్తిపరులుగా ఉన్న వీరికి ఒక్కగానొక్క కొడుకు అని, ఆ కొడుకు చెప్పాపెట్టకుండా రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లొచ్చి ఇలా హిజ్రాలతో కలసిపోయాడంటూ స్థానికులకు మహేశ్‌ కుటుంబ సభ్యులు రోదిస్తూ పేర్కొన్నారు. పోలీసులకు సమాచారం అందేలోగానే వారు మహేశ్‌ను తీసుకెళ్లినట్లు తెలిసింది.
 

click me!