సంగారెడ్డిలో దారుణం.. యువకుడి కాళ్లూ, చేతులు కట్టేసి.. తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టి హత్య..!!

By SumaBala BukkaFirst Published Oct 13, 2022, 10:59 AM IST
Highlights

సంగారెడ్డిలో ఓ గుర్తుతెలియని యువకుడి మృతదేహం కలకలం రేపుతోంది. అతడి కాళ్లూ, చేతులు కట్టేసి.. తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టి హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

సంగారెడ్డి : రోజు రోజుకూ క్రైం రేట్ పెరిగిపోతోంది. రోజూ ఎక్కడో ఓ చోట హత్యలు, ఆత్మహత్యలు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడిఏ బొల్లారం శివారులో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. రింగ్ రోడ్డు సర్వీసు రహదారిపై గుర్తుతెలియని యువకుడిని కాళ్లు చేతులు కట్టేసి తలకు  ప్లాస్టిక్ కవర్ చుట్టి చంపేసినట్లు పోలీసులు తెలిపారు. గురువారం తెల్లవారుజామున యువకుడి హత్య జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. 

ఇతర ప్రాంతాల్లో చంపేసి ఇక్కడికి తెచ్చారా? ఇక్కడే హత్య చేశారా? అనేది విచారణలో తేలుతుందని పోలీసులు తెలిపారు. ప్రేమ వ్యవహారం లేదా ఆస్తి తగాదాల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యువకుడి వయస్సు 30 ఏళ్లలోపే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

షాకింగ్.. భారీ వర్షానికి నీట్లో కొట్టుకుపోయిన బైకర్, అతను కాపాడకుంటే...

ఇదిలా ఉండగా, భోపాల్ లో ఓ దారుణ ఘటన జరిగింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో నడి రోడ్డు మీద ఇద్దరి మృతదేహాలు గొంతుకోసి కనిపించాయి. ఇది పరువు హత్యగా అనుమానిస్తున్నారు. ఎంపీ పన్నా జిల్లాలో సోమవారం పట్టపగలు ఓ యువకుడు, బాలిక హత్యకు గురయ్యారు. బాలిక 9వ తరగతి విద్యార్థిని కాగా, అబ్బాయి వయస్సు 18 సంవత్సరాలు. వారి మృతదేహాలు గొంతు కోసి రోడ్డుపై పడేసి కనిపించాయని పోలీసులు తెలిపారు.

ఇది గమనించిన ఓ బాటసారి.. మృతదేహాల ఫోటోలను తీసి పోలీసులకు పంపించాడు. దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఫోరెన్సిక్ నిపుణులు పరిశోధన ప్రారంభించారు. ఫోరెన్సిక్ వారి సమాచారం ప్రకారం బాలిక మెడ వెనుక భాగంలో లోతైన గాయం ఉందని, బాలుడి గొంతు ముందు నుండి కోసినట్టుగా ఉందని తెలుస్తోంది. ఇద్దరి శరీరం మీద అనేక కత్తిపోట్లు ఉన్నాయి. బాలిక తప్పించుకునేందుకు ప్రయత్నించగా, వెంబడించి వెనుక నుంచి నరికి చంపిన ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

ఈ ఘటనతో మండలంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. బాధితులిద్దరూ ఒకే కులానికి చెందిన వారని, అయితే పరిస్థితులు, ఘటనా స్థలాన్ని గమనిస్తే పరువు హత్యగా అనిపిస్తుందని పోలీసులు తెలిపారు. వారిది ట్రయాంగిల్ ప్రేమ నా? ప్రేమను నిరాకరించిన వారు చేసిన పనా? ఫ్యామిలీకి ఉన్న శతృవుల పనా? అనే కోణంలోనూ పోలీసులు పరిశీలిస్తు్నారు. అయితే, మధ్యాహ్నం జరిగిన హత్య విషయంలో అర్ధరాత్రి వరకు ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఇక బాలిక ఒంటరిగా ఉంటోంది. స్కూల్ కు వెడుతూ చదువుకుంటోంది. ఆమె తల్లిదండ్రులు రేవాలో పనిచేస్తున్నారు. 

click me!