ఫోన్ కోసం అన్నా చెల్లెళ్ల గొడవ.. అడ్డువచ్చిన అమ్మమ్మ హత్య..

Bukka Sumabala   | Asianet News
Published : Oct 08, 2020, 09:36 AM IST
ఫోన్ కోసం అన్నా చెల్లెళ్ల గొడవ.. అడ్డువచ్చిన అమ్మమ్మ హత్య..

సారాంశం

తాగిన మత్తులో చెల్లెలితో గొడవపడి అమ్మమ్మను హత్య చేసిన దారుణ ఘటన వికారాబాద్ లో చోటుచేసుకుంది. వికరాబాద్ మున్సిపాలీటీ పరిథిలోని కొత్తగడిలో బుధవారం జరిగిన ఈ హత్య కలకలం రేపింది.   

తాగిన మత్తులో చెల్లెలితో గొడవపడి అమ్మమ్మను హత్య చేసిన దారుణ ఘటన వికారాబాద్ లో చోటుచేసుకుంది. వికరాబాద్ మున్సిపాలీటీ పరిథిలోని కొత్తగడిలో బుధవారం జరిగిన ఈ హత్య కలకలం రేపింది. 

కొత్తగడికి చెందిన నర్సింగ్ రావు(22) ఏ పనీ చేయకుండా ఆవారాగా తిరిగేవాడు. దీంతోపాటు తాగుడుకు అలవాటు పడ్డాడు. రోజూ తాగి వచ్చి ఏదో గొడవ చేసేవాడు. అలా బుధవారం కూడా తాగివచ్చి చెల్లెల్లి దగ్గరున్న ఫోన్ ఇవ్వమని అడిగాడు. చెల్లెలు ఇవ్వనంది. దీంతో పట్టరాని కోపంతో నర్సింగరావు చెల్లెలి మీద దాడి చేశాడు.

విపరీతంగా కొడుతుండడంతో అది చూసిన వరుసకు అమ్మమ్మ అయ్యే అత్వెల్లి బాలమ్మ (80) అడ్డు వచ్చింది. అయితే తాగిన మైకంలో ఉన్న నర్సింగరావు కోపంతో బాలమ్మను నెట్టేసి, పక్కనే ఉన్న బండరాయితో బాలమ్మ తలపై కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానికులు ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. తీవ్ర రక్తస్రావం, బలమైన గాయం కారణంగా బాలమ్మ మృతి చెందింది.

విషయం తెలిసిన పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని నర్సింగరావును అదుపులోకి తీసుకున్నారు. నర్సింగరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ రాజశేఖర్ తెలిపారు.  
 

PREV
click me!

Recommended Stories

విద్యార్థి దశలోనే రోడ్ సేఫ్టీ అవగాహన కల్పించాలి: Revanth Reddy on Road Safety | Asianet News Telugu
Traffic Rules: ఫైన్ ప‌డిన వెంట‌నే బ్యాంక్ అకౌంట్ నుంచి డ‌బ్బులు క‌ట్‌.. సీఎం సంచలన ప్ర‌క‌ట‌న