రేవంత్ క్షమాపణ చెప్పాల్సిందే.. గాంధీ భవన్ ముట్టడికి యాదవ జేఏసీ నేతల పిలుపు.. టెన్షన్.. టెన్షన్..

Published : May 25, 2023, 11:42 AM IST
రేవంత్ క్షమాపణ  చెప్పాల్సిందే.. గాంధీ భవన్ ముట్టడికి యాదవ జేఏసీ నేతల పిలుపు.. టెన్షన్.. టెన్షన్..

సారాంశం

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై యాదవ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. యాదవ, కురుమలను అవమానించేలా రేవంత్ రెడ్డి మాట్లాడారని.. ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.


టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై యాదవ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. యాదవ, కురుమలను అవమానించేలా రేవంత్ రెడ్డి మాట్లాడారని.. ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. రేవంత్ రెడ్డికి వారు విధించిన డెడ్‌ లైన్ ముగియనుండటంతో.. వారు నిరసనను ఉధృతం చేశారు. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఈరోజు గాంధీ భవన్ ముట్టడికి యాదవ జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. 

ఇందిరా పార్క్‌ నుంచి గాంధీ భవన్ వరకు వెళ్లాలని వారు నిర్ణయించారు. ఈ క్రమంలోనే గాంధీ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి మాత్రం తాను ఏం తప్పుగా మాట్లాడలేదని.. క్షమాపణ చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. రేవంత్‌కు మద్దతుగా అంజనీ కుమార్ నిలిచారు. రేవంత్ రెడ్డి యాదవ్‌ల ప్రస్తావన తీయలేదని అన్నారు.  కేవలం తలసాని శ్రీనివాస్ యాదవ్ గురించే విమర్శలు చేశారని తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Jeevan Reddy: అన్నా.. నన్ను దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని: జీవన్ రెడ్డి | Asianet News Telugu
RED Alert: ఈ జిల్లాల్లో మాడు పగిలే ఎండలు 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్| Asianet News Telugu