హైద్రాబాద్ బాలానగర్ కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు: కార్మికుడికి గాయాలు

Published : Sep 26, 2022, 02:47 PM ISTUpdated : Sep 26, 2022, 04:06 PM IST
హైద్రాబాద్ బాలానగర్ కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు:  కార్మికుడికి గాయాలు

సారాంశం

 హైద్రాబాద్  బాలానగర్ లోని కెమికల్ ప్యాక్టరీలో సోమవారం నాడు పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో    ఓ కార్మికుడు గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించారు.   

హైదరాబాద్: నగరంలోని బాలానగర్ లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం నాడు పేలుడు చోటు చేసుకుంది.  ఈ ఘటనలో ఓ కార్మికుడు గాయపడ్డాడు. గాయపడిన కార్మికుడిని ఆసుపత్రికి తరలించారు. ఫ్యాక్టరీలో కెమికల్ డంప్ చేస్తున్న సమయంలో పేలుడు చోటు చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో ఫ్యాక్టరీల్లో పేలుళ్లు చోటు చేసుకుంటున్నాయి. కాకినాడ జిల్లాలోని కెమికల్ ప్యాక్టరీలో  ఈ నెల 10వ తేదీన పేలుడు చోటు చేసుకుంది. వాకలపూడి షుగర్ ఫ్యాక్టరీలోని రిఫైనరీ లో పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. 

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం వెలిమినేడులోని కెమికల్ ఫ్యాక్టరీలో ఈ ఏడాది ఆగస్టు 24వ తేదీన జరిగిన పేలుడులో ఒకరు మరణించారు. పలువురు గాయపడ్డారు. రియాక్టర్ పేలుడుతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఏడాది ఆగస్టు 22న జీడిమెట్లలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఫ్యాక్టరీలోని ఐదు రియాక్టర్లు పేలడంతో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. 

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని  కాకినాడు షుగర్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ఇద్దరు కార్మికులు మరణించారు. ఈ ఘటన ఈ ఏడాది  ఆగష్టు 19వ తేదీన చోటు చేసుకుంది. ఫ్యాక్టరీలోని కన్వేయర్ బెల్ట్ వద్ద పేలుడు చోటు చేసుకుంది. ఇక్కడ పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు ఈ ప్రమాదంలో మరణించారు. 

ఈ ఏడాది జూలై 19న వెలిమినేడులోని ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో విషవాయువులు వెలువడ్డాయి. దీంతో స్థానిక గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.  హైద్రాబాద్ జీడిమెట్లలోని వెంకటాద్రి కాలనీలో జరిగిన పేలుడులో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన  ఈ ఏడాది జూన్ రెండున చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లాలోని ఐరన్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ఒ కార్మికుడు మరణించాడు.  మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఏడాది మే 4వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. ఏపీ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఫోరస్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి ఆరుగురు కార్మికులు మరణించారు. ఈ ఘటన ఈ ఏడాది ఏప్రిల్ 14న జరిగింది.  
 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu