Women’s Reservation Bill: ప్రధానికి సోనియా లేఖపై కవిత ప్రశ్నలు..

Published : Sep 07, 2023, 11:07 AM IST
Women’s Reservation Bill: ప్రధానికి సోనియా లేఖపై కవిత ప్రశ్నలు..

సారాంశం

Hyderabad: భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) నాయ‌కురాలు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కాంగ్రెస్, బీజేపీ సహా దేశంలోని 47 రాజకీయ పార్టీలకు లేఖ రాసింది. ప్ర‌స్తుతం జ‌ర‌గ‌బోయే ప్ర‌త్యేక పార్ల‌మెంట్ స‌మావేశాల్లో మ‌హిళా బిల్లును తీసుకురావ‌డంతో పాటు ఆమోదింప‌జేయ‌డానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. 

Kavitha raises questions on Sonia’s letter to PM: భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) నాయ‌కురాలు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కాంగ్రెస్, బీజేపీ సహా  దేశంలోని 47 రాజకీయ పార్టీలకు లేఖ రాసింది. ప్ర‌స్తుతం జ‌ర‌గ‌బోయే ప్ర‌త్యేక పార్ల‌మెంట్ స‌మావేశాల్లో మ‌హిళా బిల్లును తీసుకురావ‌డంతో పాటు ఆమోదింప‌జేయ‌డానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. అయితే, ప్ర‌ధాని మోడీకి రాసిన లేఖ‌లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించాల్సిన ఆవశ్యకతను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్, ఎంపీ సోనియా గాంధీ పూర్తిగా విస్మరించడం బాధాకరమని క‌విత అన్నారు.

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాసిన లేఖలో మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌ను రాబోయే ప్రత్యేక  పార్ల‌మెంట్ సమావేశంలో ప్రభుత్వం చేపట్టాలని ప్రతిపక్ష నేత కోరుతున్న అంశాలను ఎందుకు జాబితా చేయలేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కే. కవిత బుధవారం ప్రశ్నించారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశానికి ఎటువంటి ఎజెండాను జాబితా చేయలేదని సోనియా గాంధీ బుధవారం ప్రధానికి లేఖ రాశారు. మణిపూర్‌లో హింస, ధరల పెరుగుదలతో సహా తొమ్మిది అంశాలను చర్చకు లేవనెత్తాలని అభ్యర్థించారు. అయితే, ఇందులో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును గురించి ప్ర‌స్తావించ‌క‌పోవ‌డంపై క‌విత విచారం వ్య‌క్తం చేశారు. 

“మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించాల్సిన ఆవశ్యకతను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్, ఎంపీ సోనియా గాంధీ పూర్తిగా విస్మరించడం బాధాక‌రం. లింగ సమానత్వం కోసం మీరు చేస్తున్న శక్తివంతమైన వాదన కోసం దేశం ఎదురుచూస్తోంది. ప్రధాని మోడీకి రాసిన లేఖలో 9 కీలక అంశాలను ప్రస్తావించామని, కానీ #WomensReservationBill ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. మహిళల ప్రాతినిధ్యం జాతీయ అత్యవసరం కాదా? అని ప్ర‌శ్నించారు.

ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు  (కేసీఆర్) కుమార్తె కవిత, మ‌హిళా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేస్తూ మార్చిలో నిరాహార దీక్షకు కూర్చున్నారు. దానిపై చట్టం చేయాలనే డిమాండ్‌ను పెంచడానికి భారతదేశం అంతటా రాజకీయ పార్టీలు-పౌర సమాజ సంస్థలతో చ‌ర్య‌లు జ‌రిపారు. కాగా, సోనియా గాంధీ త‌న లేఖ‌లో జాబితా చేసిన అంశాలలో కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, మతపరమైన ఉద్రిక్తతల కేసులు పెరగడం, చైనా సరిహద్దు అతిక్రమణలు, అదానీ గ్రూప్ వ్యాపార సమూహం లావాదేవీలపై దర్యాప్తు చేయడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) డిమాండ్ వంటి అనేక విషయాలు ఉన్నాయి. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Holidays : ఇంకో రెండ్రోజులే స్కూళ్లు నడిచేది.. వరుసగా నాల్రోజులు సెలవులే
Telangana Budget Sessions: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. Governor Telugu Speech | Asianet News Telugu