వంట గ్యాస్ ధర పెంపు.. తెలంగాణ బీజేపీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లిన మహిళా కాంగ్రెస్ శ్రేణులు

Siva Kodati |  
Published : Jul 06, 2022, 05:35 PM IST
వంట గ్యాస్ ధర పెంపు.. తెలంగాణ బీజేపీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లిన మహిళా కాంగ్రెస్ శ్రేణులు

సారాంశం

వంట గ్యాస్ సిలిండర్ ధర పెంపు వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. కేంద్రం తీరుపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. తాజాగా హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ కార్యాలయం ఎదుట మహిళా కాంగ్రెస్ నేతలు నిర్వహించిన ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. 

వంట గ్యాస్ సిలిండర్ ధర పెంపును నిరసిస్తూ బీజేపీ తెలంగాణ కార్యాలయం ఎదుట .. తెలంగాణ మహిళా కాంగ్రెస్ బుధవారం ధర్నాకు దిగింది. కేంద్ర ప్రభుత్వ దిష్టబొమ్మను దహనం చేశారు మహిళా కాంగ్రెస్ నేతలు. తొలుత గాంధీ భవన్ మెట్రో స్టేషన్ ముందు ఆందోళనలు చేపట్టారు. అక్కడి నుంచి బీజేపీ కార్యాలయానికి చేరుకుని లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. 

ఇకపోతే.. గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర బుధవారం భారీగా పెరిగింది. చమురు సంస్థలు రూ.50  మేర పెంచాయి. దీంతో హైదరాబాదులో గ్యాస్ ధర రూ.1055  నుంచి రూ.1105కు చేరింది. సాధారణంగా ప్రతి నెల ఒకటవ తేదీన గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. ఈనెల1న 19కిలోల వాణిజ్య సిలిండర్ ధరను చమురు సంస్థలు రూ.183.50 మేర  తగ్గించాయి.  తాజాగా  గృహావసరాల గ్యాస్ ధరను పెంచాయి. పెంచిన గ్యాస్ సిలిండర్ ధర ఇవాల్టి నుంచి అమలులోకి రానున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. 

Also Read:భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..ఎంతో తెలిస్తే షాక్...

ఇదిలా ఉండగా ఎల్పిజి గ్యాస్ వినియోగదారులకు జూలై 1న చమురు సంస్థలు గుడ్ న్యూస్ చెప్పాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరలను రూ.198  తగ్గించినట్లు ప్రభుత్వ యాజమాన్యంలోని రిటైలర్లు నోటిఫికేషన్లో తెలిపారు. దేశంలోని ప్రముఖ మెట్రో నగరాల్లో కోల్కతాలో  ఎల్పిజి సిలిండర్ ధర రూ.182, ముంబైలో రూ.190.50 చెన్నైలో రూ.187  తగ్గింది.  పెట్రోలియం కంపెనీ ఇండియన్ ఆయిల్ కూడా వాణిజ్య సిలిండర్ ధరలను తగ్గించింది. మరోవైపు 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల వినియోగదారులకు ఎలాంటి లభించలేదు. జూలై 1 వరకు  దీని ధర  మే 19న ఉన్న రేటుకే అందుబాటులో ఉంది.

గత నెలలో వాణిజ్య సిలిండర్ ధరల తగ్గింపు తర్వాత  ఈ చర్చ జరిగింది అంతకుముందు జూన్ 1న రూ.135  తగ్గించారు.  మరోవైపు డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ల వినియోగదారులకు మే నెలలో కూడా రెండు సార్లు నిరాశ ఎదురైంది.  డొమెస్టిక్ సిలిండర్ల ధరను తొలిసారిగా మే 7న రూ.50  పెంచగా..  మే 19న డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ల ధరలు మరింత పెరిగాయి.  డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధర గత నెలలో ఢిల్లీలో రూ.1,003కి  పెరిగింది. అంటే ఒక నెల లో వరుసగా రెండవ పెరుగుదల.  ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ముడిచమురు ధరలు ఎల్పీజీ ధరలు పెంచడానికి ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్ లను ప్రేరేపించాయి. గత నెలలో, వంట గ్యాస్ ధరలు సిలిండర్కు రూ.53.50వరకు పెరిగాయి.  

దీంతో దేశంలోని చాలా నగరాల్లో గ్యాస్ ధర రూ.1.000 కంటే పైకి పెరిగింది.  ఉజ్వల పథకం కింద ఉచిత శిక్షణ పొందిన 9 కోట్ల మంది పేద మహిళలు ఇతర లబ్ధిదారులకు మాత్రమే వంట గ్యాస్ ఎల్పీజీ సబ్సిడీ ఉందని,  గ్రహాలతో సహా మిగిలిన వినియోగదారులు మార్కెట్ ధరను చెల్లిస్తారని  గత నెలలో ప్రభుత్వం తెలిపింది. చమురు సెక్రటరీ పంకజం ఒక సమావేశంలో మాట్లాడుతూ జూన్ 20 20 నుండి వంటగ్యాస్పై ఎలాంటి సబ్సిడీ లేదని అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మార్చి 21న ప్రకటించిన సబ్సిడీ మాత్రమే అందించబడింది అని అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సంధ్య థియేటర్ కేసు విచారణకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్ | Asianet News Telugu
Pawan Kalyan అంటే భయమా? | Janasena Leader Shankar Goud fire on Jagadeesh Reddy | Asianet News Telugu