ప్రాణం తీసిన సెల్ఫీ మోజు: జలపాతంలో కొట్టుకుపోయిన యువతి

Siva Kodati |  
Published : Aug 23, 2020, 08:26 PM IST
ప్రాణం తీసిన సెల్ఫీ మోజు: జలపాతంలో కొట్టుకుపోయిన యువతి

సారాంశం

సెల్ఫీ మోజు ఓ యువతి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా వంకమడుగు జలపాతానికి శివానీ అనే యువతి తన సోదరుడు శివాజీతో కలిసి సెల్ఫీ దిగుతుండగా ఇద్దరు అదుపుతప్పి నీటి ప్రవాహంలో పడిపోయారు

సెల్ఫీ మోజు ఓ యువతి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా వంకమడుగు జలపాతానికి శివానీ అనే యువతి తన సోదరుడు శివాజీతో కలిసి సెల్ఫీ దిగుతుండగా ఇద్దరు అదుపుతప్పి నీటి ప్రవాహంలో పడిపోయారు.

ఆ సమయంలో నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో శివానీ కొట్టుకుపోయింది. దీనిని గమనించిన స్థానికులు  శివాజీని రక్షించగా, శివానీ మాత్రం ప్రవాహంలో కొట్టుకుపోయింది. దీంతో ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

PREV
click me!

Recommended Stories

రియ‌ల్ ఎస్టేట్‌లో ఇలాంటి మోసాలు కూడా జ‌రుగుతాయా.? చ‌నిపోయిన మ‌హిళ పేరుతో రూ. 2.5 కోట్లు స్వాహా
ఇరాన్‌లో బాంబులు పేలితే మ‌న వంటింట్లో మంట‌లు పుడుతున్నాయి.. మొద‌లైన ప్ర‌భావం.