కామారెడ్డి జిల్లాలో దారుణం: మహిళ గొంతుకోసిన దుండగులు, పరిస్థితి విషమం

By narsimha lodeFirst Published Aug 31, 2021, 9:39 AM IST
Highlights

కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకొంది. ఇవాళ ఉదయం తన ఇంటి వద్ద ముగ్గు వేస్తున్న మహిళ గొంతు కోశారు దుండగులు. పరిస్థితి విషమంగా ఉండడంతో మహిళను ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

కామారెడ్డి:  కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బర్కత్‌పుర కాలనీలో మహిళ గొంతుకోసి పారిపోయాడు ఓ దుండగుడు. తీవ్రంగా గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. నిషా అనే మహిళ తన ఇంటి వద్ద మంగళవారం నాడు ఉదయం ముగ్గు వేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మహిళ గొంతు కోశారని స్థానికులు చెప్పారు.

 

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బర్కత్‌పుర కాలనీలో మహిళ గొంతుకోసి పారిపోయాడు ఓ దుండగుడు. తీవ్రంగా గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. నిషా అనే మహిళ తన ఇంటి వద్ద మంగళవారం నాడు ఉదయం ముగ్గు వేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. pic.twitter.com/y4DMegjCvY

— Asianetnews Telugu (@AsianetNewsTL)

బాధితురాలిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆమె చికిత్స చేశారు. గొంతు నరాలు తెగినట్టుగా వైద్యులు గుర్తించారు.బాధితురాలిని కాపాడేందుకు వైద్యలు చికిత్స ప్రారంభించారు.అయితే మహిళ గొంతు కోయడానికి గల కారణాలు తెలియరాలేదు.  ఈ విషయమై బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

click me!