మహిళా పూజారి దారుణ హత్య..! ఒంటరిగా ఉందని చూసి.. మెడకు ఉరి బిగించి..!

By AN TeluguFirst Published Aug 31, 2021, 2:04 PM IST
Highlights

కుటుంబం మొత్తం నగరంలో నివాసం ఉంటుండగా శోభాశర్మ ఒంటరిగానే ఆలయంలో ఉంటూ దేవుడికి పూజా కైంకర్యాలు నిర్వహిస్తూ వస్తున్నారు. కాగా ఈ నెల 28వ తేదీ రాత్రి 7.30 గంటల సమయంలో మనోజ్ తల్లికి ఫోన్ చేయగా స్పందించలేదు. 

హైదరాబాద్ : మహిళా పూజారి దారుణ హత్యకు గురైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, రంగనాయకుల కాలనీ నుంచి మామిడిపల్లి వెళ్లే దారిలో ఉన్న రంగనాయకుల దేవాలయంలో కౌశిక్ శోభాశర్మ (76), ఆమె కుమారుడు మనోజ్ శర్మ పూజారులుగా కొనసాగుతున్నారు. 

కుటుంబం మొత్తం నగరంలో నివాసం ఉంటుండగా శోభాశర్మ ఒంటరిగానే ఆలయంలో ఉంటూ దేవుడికి పూజా కైంకర్యాలు నిర్వహిస్తూ వస్తున్నారు. కాగా ఈ నెల 28వ తేదీ రాత్రి 7.30 గంటల సమయంలో మనోజ్ తల్లికి ఫోన్ చేయగా స్పందించలేదు. దీంతో మామిడిపల్లిలోని ఓ యువకుడిని ఫోన్ లో చెప్పి అక్కడికి వెళ్లి చూసిరమ్మనగా.. శోభాశర్మ మృతి చెంది కనిపించింది. 

వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో వెళ్లి చూడగా.. శోభా శర్మ మెడకు ఉరి బిగించి కనిపించింది. ముఖంపై కూడా రక్తపు గాయాలున్నాయి. గదిలో ఉన్న అల్మారా తలుపులు పగలగొట్టారు. ఆమె ఒంటరిగా ఉంటుందని తెలిసినవారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. 

మనోజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా పోలీస్ స్టేషన్ పరిధిలో 38 రోజుల వ్యవధిలో నాలుగు హత్యోదాంతాలు చోటు చేసుకోవడం పట్ల స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. 

click me!