బ్రేకింగ్: పులి పంజాకు మరొకరు బలి.. వణుకుతున్న జనం

Siva Kodati |  
Published : Nov 29, 2020, 03:50 PM IST
బ్రేకింగ్: పులి పంజాకు మరొకరు బలి.. వణుకుతున్న జనం

సారాంశం

కొమురం భీం జిల్లాలో మరోసారి పులి పంజా విసిరింది. ఆదివారం పులి దాడిలో ఓ యువతి మృతి చెందింది. పెంచికల పేట మండలం కొండపల్లిలో ఈ ఘటన జరిగింది

కొమురం భీం జిల్లాలో మరోసారి పులి పంజా విసిరింది. ఆదివారం పులి దాడిలో ఓ యువతి మృతి చెందింది. పెంచికల పేట మండలం కొండపల్లిలో ఈ ఘటన జరిగింది. పత్తి చేనులో పని చేస్తున్న నిర్మల అనే యువతిపై పులి దాడి చేసింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు.

మరోవైపు పులి సంచారంతో కొండపల్లి వాసులు భయాందోళనకు గురవుతున్నారు. కాగా, ఈ నెల 11న దహేగాం మండలం దిగిడలో యువకుడిని పులి చంపిన సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

రియ‌ల్ ఎస్టేట్‌లో ఇలాంటి మోసాలు కూడా జ‌రుగుతాయా.? చ‌నిపోయిన మ‌హిళ పేరుతో రూ. 2.5 కోట్లు స్వాహా
ఇరాన్‌లో బాంబులు పేలితే మ‌న వంటింట్లో మంట‌లు పుడుతున్నాయి.. మొద‌లైన ప్ర‌భావం.