ఇద్దరు పిల్లలతో సహా గోదావరిలో దూకిన మహిళ.. బాసరలో ఘటన..

Published : Jan 23, 2023, 03:30 PM IST
 ఇద్దరు పిల్లలతో సహా గోదావరిలో దూకిన మహిళ.. బాసరలో ఘటన..

సారాంశం

నిర్మల్‌ జిల్లా బాసరలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరి నదిలోకి దూకింది.

నిర్మల్‌ జిల్లా బాసరలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరి నదిలోకి దూకింది. ఈ ఘటనలో మహిళతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు మృతిచెందారు. మృతులను నిజామాబాద్‌కు చెందిన మానస, ఆమె కొడుకు బాలాదిత్య, కూతురు నవ్యశ్రీ‌లుగా గుర్తించారు. అయితే మానస తన ఇద్దరు పిల్లలతో కలిసి బస్సులో నిజామాబాద్ నుంచి బాసరకు చేరుకుని గోదావరి నది వద్దకు ఆత్మహత్యకు పాల్పడింది. పిల్లలతో సహా నీటిలో వెళ్లి ప్రాణాలను తీసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు  ఘటన స్థలానికి చేరుకుని.. గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు. 

గజ ఈతగాళ్లు మానస, ఆమె ఇద్దరు పిల్లల మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టమ్ నిమిత్తం  ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టుగా పోలీసులు తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

100 కోట్లకు పైగా ఆస్తులు.. ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగళం| ACB Raids on Hyderabad | Asianet Telugu
RTC: ఎర్ర బ‌స్సులు ప‌చ్చ‌గా ఎందుకు మారాయి.? దీని వెన‌కాల ఉన్న అస‌లు కార‌ణం ఏంటో తెలుసా.?