శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పట్టుబడ్డ 2కిలోల బంగారం

Arun Kumar P   | Asianet News
Published : Dec 27, 2020, 10:59 AM IST
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పట్టుబడ్డ 2కిలోల బంగారం

సారాంశం

దుబాయ్ నుండి వచ్చిన ఓ ప్రయాణికురాలిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా 2.021 కిలోల బంగారం పట్టుబడింది.

హైదరాబాద్: దుబాయ్ నుండి హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పట్టుబడింది. దుబాయ్ నుండి వచ్చిన ఓ ప్రయాణికురాలిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా 2.021 కిలోల బంగారం పట్టుబడింది. ఈ బంగారానికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో అధికారులు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

మహిళ వద్ద లభించిన బంగారం బిస్కెట్ల రూపంలోనే కాకుండా నగల రూపంలో వున్నట్లు అధికారులు తెలిపరు. కస్టమ్స్ అధికారుల అదుపులో వున్న నిందితురాలిని విచారిస్తున్నారు. కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.96.04 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.


 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఫిబ్రవరి, మార్చిలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. వీటిని మ్యాంగో షవర్స్ ఎందుకంటారో తెలుసా..?
ఈ వీకెండ్ హైదరబాదీలకు కష్టాలు తప్పవు... బయటకు వెళ్లారో బుక్ అయినట్లే..!