ఏడు నెలల్లో మూడుసార్లు యువతికి పాము కాటు: మూడో సారి ఆదిలాబాద్ యువతి మృత్యు ఒడిలోకి

Published : Mar 20, 2022, 09:32 AM IST
ఏడు నెలల్లో మూడుసార్లు యువతికి పాము కాటు: మూడో సారి ఆదిలాబాద్ యువతి మృత్యు ఒడిలోకి

సారాంశం

ఏడు మాసాల్లో మూడుసార్లు పాము కాటుకు గురైంది యువతి. మూడోసారి పాము కాటుకు గురైన ప్రణాళి చివరికి మరణించింది., రెండు దఫాలు ప్రాణాపాయం నుండి బయట పడింది.

ఆదిలాబాద్: ఏడు నెలల్లో మూడు సార్లు ఓStudentని Snake కరిచింది. రెండు సార్లు Snake bite నుండి ఆమె ప్రాణాపాయం నుండి తప్పించుకొంది. కానీ, మూడో సారి మాత్రం ఆమె మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. చదువులో చురుకుగా ఉండేదని స్నేహితులు చెబుతున్నారు.

ఆదిలాబాద్ జిల్లా బేల మండలం  బెదోడ గ్రామానికి చెందిన ప్రణాళి పాము కాటుతో మరణించింది.  ఆమె Adilabad లోని ఓ ప్రైవేట్ కాలేజీలో Degree చదువుతుంది. Pranaali కి  గతంలో రెండు సార్లు పాము కరిచింది. రెండు దఫాలు ఆమె కాటు నుంటి ప్రాణాలతో బయట పడింది. కానీ చివరికి ఈ నెల 18వ తేదీన  ఆమెను పాము కరిచింది. Hospitalలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. 

గత ఏడాది సెప్టెంబర్ మాసంలో ప్రణాళి తన నివాసంలో నిద్రిస్తున్న సమయంంలో పాము కాటుకు గురైంది. అయితే ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. సుమారు రూ. 4 లక్షలు ఖర్చు చేసి ఆమెను రక్షించుకొన్నారు.  ఆ తర్వాత ఈ ఏడాది జనవరి మాసంలో మరో సారి ఆమె పాము కాటుకు గురైంది. ఇంటి ఆవరణలో కూర్చొన్న సమయంలో ఆమెను పాము కరిచింది. ఈ సమయంలో కూడా ఆమె చికిత్స నుండి కోలుకుంది. ఈ నెల 18వ తేదీన Holi ని పురస్కరించుకొని తన స్నేహితులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రణాళి ప్లాన్ చేసుకొంది. తన కాలేజీ బ్యాగులో రంగులను తెచ్చుకొంది. అయితే ఈ బ్యాగులో పాము ఉంది.ఈ విషయాన్ని గుర్తించిన ప్రణాళి బ్యాగులో రంగులను బయటకు తీస్తున్న సమయంలో పాము కాటు వేసింది. ఆమెను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రణాళి మరణించింది. 

PREV
click me!

Recommended Stories

Jeevan Reddy Comments బిఆర్ఎస్ పార్టీకి శాపనార్థాలుపెట్టకు తల్లీ: జీవన్ రెడ్డి | Asianet News Telugu
Telangana RTC: ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం సంబరాల్లో ఆర్టీసీ కార్మికులు | Asianet News Telugu