ఏడు నెలల్లో మూడుసార్లు యువతికి పాము కాటు: మూడో సారి ఆదిలాబాద్ యువతి మృత్యు ఒడిలోకి

Published : Mar 20, 2022, 09:32 AM IST
ఏడు నెలల్లో మూడుసార్లు యువతికి పాము కాటు: మూడో సారి ఆదిలాబాద్ యువతి మృత్యు ఒడిలోకి

సారాంశం

ఏడు మాసాల్లో మూడుసార్లు పాము కాటుకు గురైంది యువతి. మూడోసారి పాము కాటుకు గురైన ప్రణాళి చివరికి మరణించింది., రెండు దఫాలు ప్రాణాపాయం నుండి బయట పడింది.

ఆదిలాబాద్: ఏడు నెలల్లో మూడు సార్లు ఓStudentని Snake కరిచింది. రెండు సార్లు Snake bite నుండి ఆమె ప్రాణాపాయం నుండి తప్పించుకొంది. కానీ, మూడో సారి మాత్రం ఆమె మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. చదువులో చురుకుగా ఉండేదని స్నేహితులు చెబుతున్నారు.

ఆదిలాబాద్ జిల్లా బేల మండలం  బెదోడ గ్రామానికి చెందిన ప్రణాళి పాము కాటుతో మరణించింది.  ఆమె Adilabad లోని ఓ ప్రైవేట్ కాలేజీలో Degree చదువుతుంది. Pranaali కి  గతంలో రెండు సార్లు పాము కరిచింది. రెండు దఫాలు ఆమె కాటు నుంటి ప్రాణాలతో బయట పడింది. కానీ చివరికి ఈ నెల 18వ తేదీన  ఆమెను పాము కరిచింది. Hospitalలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. 

గత ఏడాది సెప్టెంబర్ మాసంలో ప్రణాళి తన నివాసంలో నిద్రిస్తున్న సమయంంలో పాము కాటుకు గురైంది. అయితే ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. సుమారు రూ. 4 లక్షలు ఖర్చు చేసి ఆమెను రక్షించుకొన్నారు.  ఆ తర్వాత ఈ ఏడాది జనవరి మాసంలో మరో సారి ఆమె పాము కాటుకు గురైంది. ఇంటి ఆవరణలో కూర్చొన్న సమయంలో ఆమెను పాము కరిచింది. ఈ సమయంలో కూడా ఆమె చికిత్స నుండి కోలుకుంది. ఈ నెల 18వ తేదీన Holi ని పురస్కరించుకొని తన స్నేహితులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రణాళి ప్లాన్ చేసుకొంది. తన కాలేజీ బ్యాగులో రంగులను తెచ్చుకొంది. అయితే ఈ బ్యాగులో పాము ఉంది.ఈ విషయాన్ని గుర్తించిన ప్రణాళి బ్యాగులో రంగులను బయటకు తీస్తున్న సమయంలో పాము కాటు వేసింది. ఆమెను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రణాళి మరణించింది. 

PREV
click me!

Recommended Stories

Telangana: రూ. 7500 కోట్లతో భారీ ప్రాజెక్ట్.. తెలంగాణలో ఈ ప్రాంత రూపురేఖలు మారడం ఖాయం
పవన్..నీ భూటకపు నాటకాలు ఆపు కళ్యాణ్: ఎమ్మైల్సీ అద్దంకి దయాకర్ MLC Addanki Dayakar | Asianet Telugu