మంత్రగాడిచ్చిన పొడి తిని మహిళ మృతి: పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో కీలక విషయాలు

By Siva KodatiFirst Published Apr 14, 2019, 11:43 AM IST
Highlights

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఒక మంత్రగాడు ఇచ్చిన పోడి తినడంతో ఓ మహిళ మరణించింది. వివరాల్లోకి వెళితే.. బాలాపూర్ మండలం జల్‌పల్లి గ్రామానికి చెందిన రేష్మా బేగమ్ అనే మహిళ గత ఐదేళ్లుగా వింతగా ప్రవర్తిస్తోంది.

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఒక మంత్రగాడు ఇచ్చిన పోడి తినడంతో ఓ మహిళ మరణించింది. వివరాల్లోకి వెళితే.. బాలాపూర్ మండలం జల్‌పల్లి గ్రామానికి చెందిన రేష్మా బేగమ్ అనే మహిళ గత ఐదేళ్లుగా వింతగా ప్రవర్తిస్తోంది.

తల్లి ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లడంతో తండ్రితో పాటు రేష్మా నివసిస్తోంది. అయితే ఎంతమంది వైద్యులకు చూపించినా, ఎన్ని మందులు వాడినా రేష్మాకు నయం కాకపోవడంతో ఆమె తండ్రి మహమ్మద్ ఫరూఖ్ ఒక మంత్రగాడిని ఆశ్రయించాడు.

శుక్రవారం కుమార్తెను తీసుకుని తన వద్దకు రావాల్సిందిగా మంత్రగాడు నయిమ్.. ఫరూఖ్‌కు తెలిపాడు. అతను చెప్పినట్లే అక్కడికి తీసుకెళ్లాడు తండ్రి. ఈ క్రమంలో రేష్మాకు అతను ఒక పొడిని ఇచ్చాడు.

దీనిని ఇంటికి వెళ్లాకా సేవించాలని చెప్పాడు. ఫరూఖ్ కూతురిని తీసుకుని ఇంటి వచ్చి పొడి నోట్లో వేసుకోమని చెప్పి తాను నిద్రపోయాడు. శనివారం ఉదయం కూతురిని లేపేందుకు ప్రయత్నించగా, ఆమె ఎంతకు నిద్రలేవ లేదు.

అంతేకాకుండా ఆమె కాళ్లు చేతులపై గాయాలున్నాయి. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలపడంతో.. సమాచారం అందుకున్న పోలీసులు రేష్మాను ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఆమె చనిపోయినట్లు తెలిపారు.

పోస్ట్‌మార్టం నివేదికలో రేష్మాపై మంత్రగాడు అత్యాచారయత్నం చేసినట్లుగా తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంత్రగాడు నయిం కోసం గాలిస్తున్నారు. 
 

click me!