వేములవాడలో గుండెపోటుతో భక్తురాలు మృతి

Published : Mar 30, 2021, 07:32 PM IST
వేములవాడలో గుండెపోటుతో భక్తురాలు మృతి

సారాంశం

వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన ఓ భక్తురాలు గుండెపోటుతో మృత్యువాత పడింది. ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి తరలించారు.

వేములవాడ: వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన ఓ భక్తురాలు గుండెపోటుతో మృతి చెందింది. స్థానికుల కథనం మేరకు.. మహబూబాబాద్‌ జిల్లా పాకాల కొత్తగూడెం మండలం, ఎదులపల్లి గ్రామానికి చెందిన కడుగూరి పూలమ్మ(60) సోమవారం కుటుంబ సభ్యులతో కలసి రాజన్నను దర్శించుకుంది.

మంగళవారం బద్ది పోచమ్మకు బోనం మొక్కును చెల్లించుకునేందుకు వసతి గది నుంచి బయలుదేరింది. ఈ క్రమంలో రోడ్డుపైనే అకస్మాత్తుగా పడిపోయి అక్కడికక్కడే మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు

PREV
click me!

Recommended Stories

రూ. 1641 కోట్ల‌తో నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం.. ఈ రెండు ప‌ట్ట‌ణాల మ‌ధ్య త‌గ్గ‌నున్న ప్ర‌యాణ స‌మ‌యం
Fertility: తెలంగాణ‌లో ప‌డిపోతున్న సంతానోత్ప‌త్తి.. ఫెర్టిలిటీ చికిత్సల్లో పారదర్శకత పెరగాల్సిందే