వేములవాడలో గుండెపోటుతో భక్తురాలు మృతి

Published : Mar 30, 2021, 07:32 PM IST
వేములవాడలో గుండెపోటుతో భక్తురాలు మృతి

సారాంశం

వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన ఓ భక్తురాలు గుండెపోటుతో మృత్యువాత పడింది. ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి తరలించారు.

వేములవాడ: వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన ఓ భక్తురాలు గుండెపోటుతో మృతి చెందింది. స్థానికుల కథనం మేరకు.. మహబూబాబాద్‌ జిల్లా పాకాల కొత్తగూడెం మండలం, ఎదులపల్లి గ్రామానికి చెందిన కడుగూరి పూలమ్మ(60) సోమవారం కుటుంబ సభ్యులతో కలసి రాజన్నను దర్శించుకుంది.

మంగళవారం బద్ది పోచమ్మకు బోనం మొక్కును చెల్లించుకునేందుకు వసతి గది నుంచి బయలుదేరింది. ఈ క్రమంలో రోడ్డుపైనే అకస్మాత్తుగా పడిపోయి అక్కడికక్కడే మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు

PREV
click me!

Recommended Stories

Jeevan Reddy: సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు| Asianet News Telugu
Rain Alert: ఇది క‌దా కూల్ న్యూస్ అంటే.. వ‌చ్చే వారం రోజులు వ‌ర్షాలు, ఎండ నుంచి బిగ్ రిలీఫ్