నాపై లైంగిక దాడి: బీజేపీ నేత రఘునందన్‌రావుపై మహిళ ఫిర్యాదు

Published : Feb 03, 2020, 04:22 PM IST
నాపై లైంగిక దాడి: బీజేపీ నేత రఘునందన్‌రావుపై మహిళ ఫిర్యాదు

సారాంశం

తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత రఘునందన్ రావు తనపై లైంగిక దాడికి పాల్పడినట్టుగా ఓ మహిళ సైబరాబాద్ సీపీ సజ్జనార్ కు ఫిర్యాదు చేసింది. 

హైదరాబాద్: బీజేపీ నేత రఘునందన్ రావు తనపై లైంగిక దాడికి పాల్పడినట్టుగా  ఓ మహిళ సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేసింది.

ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన రఘునందన్ రావు తనపై లైంగిక దాడికి పాల్పడినట్టుగా మహిళ సీపీ సజ్జనార్ కు ఫిర్యాదు చేసింది. అంతేకాదు  ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని ఆమె సీపీని కోరింది.

సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేయడానికి ముందే  మానవ హక్కుల  సంఘానికి ఫిర్యాదు చేసినట్టుగా బాధితురాలుచెప్పింది.రఘునందన్ రావు తొలుత టీఆర్ఎస్‌లో ఉన్నాడు. టీఆర్ఎస్‌లో రఘునందన్ రావు ఎక్కువ కాలం ఉండలేదు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరారు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కీలక నేతల్లో ఆయనకు చోటు దక్కింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

రియ‌ల్ ఎస్టేట్‌లో ఇలాంటి మోసాలు కూడా జ‌రుగుతాయా.? చ‌నిపోయిన మ‌హిళ పేరుతో రూ. 2.5 కోట్లు స్వాహా
ఇరాన్‌లో బాంబులు పేలితే మ‌న వంటింట్లో మంట‌లు పుడుతున్నాయి.. మొద‌లైన ప్ర‌భావం.