భర్తను గొంతు నులిమి చంపిన భార్య.. వివాహేతర సంబంధమే కారణం?

By Mahesh KFirst Published Sep 6, 2022, 10:47 PM IST
Highlights

గోదావరిఖనిలో ఓ భార్య భర్తను గొంతు నులిమి హత్య చేసింది. ఈ దంపతుల మధ్య కొన్నాళ్లుగా గొడవలు తరుచూ జరుగుతున్నాయి. తాజాగా, జరిగిన గొడవలో భార్య శ్రావణి.. భర్త గొంతు నులిమేసి హతమార్చినట్టు తెలుస్తున్నది. భార్య భర్తల మధ్య గొడవలకు వివాహేతర సంబంధమే కారణం అనే అనుమానాలు స్థానికులు వెలువరుస్తున్నారు.

హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దుర్ఘటన జరిగింది. వివాహేతర సంబంధం ఆ కాపురంలో చిచ్చు పెట్టింది. వివాహేతర సంబంధం కారణంగా ఆ భార్య భర్తల మధ్య తరుచూ గొడవలు జరిగాయి. చివరకు ఒకరు మరొకరిని చంపేసే దాకా పరిస్థితులు వెళ్లాయి. గోదావరిఖని ఎన్‌టీపీసీ ఆటో నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఎన్‌టీపీసీ ఆటోనగర్‌లో శ్రావణి, తన భర్తతో కాపురం ఉంటున్నది. వారికి ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి అయింది. వారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ ఎనిమిదేళ్ల కాపురంలో వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అంతా సజావుగా సాగుతున్నదని అనుకుంటున్న తరుణంలో భార్య భర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. గత కొన్ని రోజులుగా భార్య భర్తల మధ్య గొడవలు తీవ్రంగా జరుగుతున్నాయి. ఇదే క్రమంలో తాజాగా ఓ గొడవ జరిగింది. ఈ ఘర్షణలోనే భార్య శ్రావణి.. భర్త గొంతు నులిమేసింది. భర్త గొంతు నులిమి హత్య చేసినట్లు తెలుస్తున్నది. భర్తను హతమార్చడానికి అక్రమ సంబంధమే కారణం అనే అనుమానాలు వస్తున్నాయి. పోలీసులకు ఈ విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు.

click me!