జూలై 8న కొత్త పార్టీ ఏర్పాటు, ప్రజల ఆశయాలకు అనుగుణంగా ఎజెండా: వైఎస్ షర్మిల

Published : Jun 09, 2021, 11:24 AM ISTUpdated : Jun 09, 2021, 11:28 AM IST
జూలై 8న కొత్త పార్టీ ఏర్పాటు, ప్రజల ఆశయాలకు అనుగుణంగా ఎజెండా: వైఎస్ షర్మిల

సారాంశం

జూలై 8వ తేదీన పార్టీని ఏర్పాటు చేయబోతున్నామని వైఎస్ షర్మిల ప్రకటించారు.   

హైదరాబాద్: జూలై 8వ తేదీన పార్టీని ఏర్పాటు చేయబోతున్నామని వైఎస్ షర్మిల ప్రకటించారు. బుధవారం నాడు రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన వైఎస్ఆర్ అభిమానులతో షర్మిల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగించారు.  ప్రజల ఆశయాలకు అనుగుణంగా పార్టీ విధానాలు ఉంటాయని ఆమె చెప్పారు. ప్రతి తెలంగాణ బిడ్డ మన ఎజెండా చూసి మెచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 

also read:జులై 8న వైఎస్ షర్మిల వైఎస్సార్ టీపీ: అభ్యంతరం లేదని వైఎస్ విజయమ్మ లేఖ

కార్యకర్తలు చెప్పిందే  సిద్దాంతమన్నారు.  కొత్తగా ఏర్పాటు చేయబోయే పార్టీలో కార్యకర్తలకే పెద్దపీట వేస్తామని  ఆమె హామీ ఇచ్చారు.కార్యకర్తలే రేపటి ప్రజా నాయకులుగా నిలబడతారని ఆమె అభిప్రాయపడ్డారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డితో లబ్ది పొందని ఇల్లు తెలంగాణలో లేదని  ఆమె చెప్పారు. నాయకులను నిత్యం ప్రజల వద్దకు తీసుకెళ్లేవారే కార్యకర్తలని ఆమె తెలిపారు.

 

జెండాలు మోయడంతో పాటు జనం గుండె చప్పుడు విని అజెండాలు రాసే వాళ్లే కార్యకర్తలని ఆమె అభిప్రాయపడ్డారు.తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం తమ పార్టీ పనిచేస్తోందని ఆమె చెప్పారు.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున పార్టీని ఆమె ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలపై అవిశ్రాంతంగా పోరాటం చేస్తామని షర్మిల ప్రకటించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి