
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలను వరంగల్, హన్మకొండ జిల్లాలుగా పునర్వ్యస్థీకరించింది. పేర్లతో పాటు జిల్లాల స్వరూపమూ కొంత మార్చింది. హన్మకొండ, పరకాల రెవెన్యూ డివిజిన్లతో హన్మకొండ, వరంగల్, నర్సంపేట రెవెన్యూ డివిజన్లతో వరంగల్ జిల్లాను ఏర్పాటు చేస్తూ ఈ రోజు రెవెన్యూ శాఖ తుది నోటిఫికేషన్ విడుదలైంది. ఇవ్వాళ్టి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని సీఎం సోమేశ్ కుమార్ విడుదల చేసిన నోటిఫికేషన్ పేర్కొంది. ఈ నిర్ణయంతో ఆయా జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో ఎన్నికైన బాడీల్లో ఎలాంటి మార్పులు జరగబోవని వివరించింది.
హన్మకొండ జిల్లాలో 14 మండలాలు, వరంగల్ జిల్లాలో 13 మండలాలున్నాయి. ఇది వరకు వరంగల్ అర్బన్లో ఉన్న హన్మకొండ, ఖాజీపేట్, ఐనవోలు, హసన్పర్తి, వేలేర్, ధర్మసాగర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్ మండలాలతోపాటు వరంగల్ రూరల్లో ఉన్న పర్కాల్, నదికూడ, దామెర, ఆత్మకూర్, శాయంపేట్లూ హన్మకొండ జిల్లా పరిధిలోకి వచ్చాయి. కాగా, ఇది వరకు వరంగల్ అర్బన్లో ఉన్న వరంగల్, ఖిలా వరంగల్తోపాటు వరంగల్ రూరల్లోని సంగెం, గీసుగొండ, వర్ధన్నపేట్, పర్వతగిరి, రాయపర్తి, నర్సంపేట్, చెన్నారావుపేట్, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపూర్, నెక్కొండ మండలాలు వరంగల్ జిల్లా పరిధిలోకి చేరాయి.