మహాకూటమి లక్ష్యాన్ని అన్ని పార్టీలు గౌరవించాలని కూటమి ఐక్యతను దెబ్బతీయోద్దని కాంగ్రెస్ పార్టీ స్టార్ కాంపైనర్ విజయశాంతి విజ్ఞప్తి చేశారు. కూటమిలోని కాంగ్రెస్ తోపాటు ఇతర భాగస్వామ్య పార్టీలు రెబల్స్ అభ్యర్థుల నామినేషన్స్ విత్ డ్రా చేసుకునేలా ప్రయత్నించాలని సూచించారు.
హైదరాబాద్:మహాకూటమి లక్ష్యాన్ని అన్ని పార్టీలు గౌరవించాలని కూటమి ఐక్యతను దెబ్బతీయోద్దని కాంగ్రెస్ పార్టీ స్టార్ కాంపైనర్ విజయశాంతి విజ్ఞప్తి చేశారు. కూటమిలోని కాంగ్రెస్ తోపాటు ఇతర భాగస్వామ్య పార్టీలు రెబల్స్ అభ్యర్థుల నామినేషన్స్ విత్ డ్రా చేసుకునేలా ప్రయత్నించాలని సూచించారు.
ఇప్పటికే ఆయా పార్టీల నేతలు ఆందోళనలో ఉన్నారని ఈ నేపథ్యంలో కార్యకర్తల మనోభవాలను దృష్టిలో ఉంచుకుని రెబల్స్ ను బుజ్జగించేందుకు ప్రయత్నించాలని కోరారు. లేని పక్షంలో కూటమి ఐక్యత దెబ్బతినే ప్రమాదం ఉందని అలాగే కేసీఆర్ ను గద్దె దించాలన్నసంకల్పం సడలిపోతుందని తెలిపారు.