హైద్రాబాద్ పంజగుట్టలో అంబేద్కర్ విగ్రహం పున:ప్రతిష్టించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేత వి.హనుమంతరావు, మాజీ ఎంపీ హర్షకుమార్ గురువారం నాడు న్యూఢిల్లీలో దీక్షకు దిగారు.
న్యూఢిల్లీ: హైద్రాబాద్ పంజగుట్టలో అంబేద్కర్ విగ్రహం పున:ప్రతిష్టించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేత వి.హనుమంతరావు, మాజీ ఎంపీ హర్షకుమార్ గురువారం నాడు న్యూఢిల్లీలో దీక్షకు దిగారు.
హైద్రాబాద్ పంజగుట్ట సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహన్ని జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. ఈ విగ్రహన్ని తిరిగి అదే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరుతూ వి. హనుమంతరావు కొంతకాలంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగానే ఇవాళ న్యూఢిల్లీలో కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు, మాజీ ఎంపీ హర్షకుమార్ లు దీక్షకు దిగారు.. ఉద్దేశ్యపూర్వకంగానే ఈ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఈ విగ్రహన్ని తొలగించిందని వి. హనుమంతరావు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.