నాలుగేళ్ల హైదరాబాద్ బాలికపై జార్ఖండ్ బాలుడి అత్యాచారయత్నం

First Published Jul 18, 2018, 5:21 PM IST
Highlights

సినిమాల ప్రభావమో, తల్లిదండ్రుల నిర్లక్ష్యమో ఏమోగానీ చిన్న వయస్సులోనే పిల్లలు దారుణాలకు పాల్పడుతున్న సంఘటనలు ఈ మధ్యకాలంలో అనేకం బైటపడుతున్నాయి. ఏం చేస్తున్నారో కూడా తెలియని వయసులో చిన్నారులు దారుణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనే హైదరాబాద్ లోని ముషీరాబాద్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
 

సినిమాల ప్రభావమో, తల్లిదండ్రుల నిర్లక్ష్యమో ఏమోగానీ చిన్న వయస్సులోనే పిల్లలు దారుణాలకు పాల్పడుతున్న సంఘటనలు ఈ మధ్యకాలంలో అనేకం బైటపడుతున్నాయి. ఏం చేస్తున్నారో కూడా తెలియని వయసులో చిన్నారులు దారుణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనే హైదరాబాద్ లోని ముషీరాబాద్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం ఉపాధి కోసం హైదరాబాద్ కు వలస వచ్చింది. వీరు సికింద్రాబాద్ సమీపంలోని ముషీరాబాద్ ప్రాంతంలో నివాసముంటున్నారు. అయితే ఈ కుటుంబానికి చెందిన అజయ్ కుమార్(14) అనే మైనర్ బాలుడు ఓ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అదే ప్రాంతంలో నివాసముండే ఓ నాలుగేళ్ల చిన్నారిపై అజయ్
అత్యాచారయత్నం చేశాడు. అతడు చిన్నారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి వికృతంగా ప్రవర్తించాడు. దీంతో భయపడిపోయిన చిన్నారి గట్టిగా కేకలు వేస్తూ ఏడవటం ఆరంభించింది. దీంతో కొందరు అటువైపు రావడం గమనించిన నిందితుడు అక్కడినుండి పరారయ్యాడు.

ఈ విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని అరెస్ట్ చేసి జువైనల్ హోం కు తరలించారు.

 

click me!