ఎమ్మెల్యే ఫాంహౌస్ లో బిల్డింగ్ మీదినుంచి జారిపడి ఒకరు, గుండెపోటు మరొకరు మృతి...

Published : Mar 04, 2023, 06:50 AM IST
ఎమ్మెల్యే ఫాంహౌస్ లో బిల్డింగ్ మీదినుంచి జారిపడి ఒకరు, గుండెపోటు మరొకరు మృతి...

సారాంశం

మైనంపల్లి హనుమంతరావు ఫాంహౌస్ లో కూల్చివేత పనుల్లో ఇద్దరు కూలీలు మృతి చెందిన ఘటన కలకలం రేపింది.   

నిజామాబాద్ : నిజామాబాదులో విషాదకరమైన  ఘటన చోటుచేసుకుంది. ఎమ్మెల్యే ఫామ్ హౌస్ లో శుక్రవారం భవన కూల్చివేత పనులు చేస్తున్న ఇద్దరు కూలీలు మృతిచెందారు.  బిల్డింగ్ నుండి ప్రమాదవశాత్తు జారిపడి ఓ కూలి మృతి చెందాడు. అది చూసి గుండెపోటుతో మరో కూలి చనిపోయాడు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం జన్నేపల్లిలో ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇవి… మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు జన్నేపల్లిలో ఒక అతిథి గృహం ఉంది. దీనికి నెల రోజులుగా మరమ్మత్తులు జరుగుతున్నాయి.  నిజామాబాదుకు చెందిన ఓ గుత్తేదారు ఈ పనులను నెల రోజులుగా చేస్తున్నాడు.

ఈ పనుల్లో నిజామాబాద్ వినాయక్ నగర్ కు చెందిన కొండపల్లి రాజు (28) చేరాడు. రాజు తల్లిదండ్రులతో కలిసి ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ ఉండేవాడు. ఎమ్మెల్యే ఫామ్ హౌస్ కూల్చివేత పనుల కోసం మరో ఐదుగురు కూలీలతో పాటు రాజు కూడా వచ్చాడు. గోడ కూలుస్తున్నారు. ఇంతలో కాలుజారి రాజు అక్కడి నుంచి కిందపడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఒక నిమిషం ఏం జరిగిందో ఎవరికి అర్థం కాలేదు. అంతలోనే తేరుకొని గమనించేసరికి రాజు మృతి చెంది కనిపించాడు. అదే బిల్డింగ్ లో మరో కూలి పని చేస్తున్నాడు.  అతని పేరు  సాయిలు(29). 

అరెస్ట్ చేస్తే ప్రజల్లోకి వెళతా.. బీజేపీ అసలు టార్గెట్ నేను కాదు, కేసీఆరే : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుపై కవిత

రాజు కింద పడి మరణించడం చూసిన సాయిలు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. వాంతులు చేసుకోవడం మొదలుపెట్టాడు. దీంతో గుండెపోటు వచ్చింది. అక్కడికక్కడే చనిపోయాడు. తోటి కూలీలు చాతిపై తడుతూ సిపిఆర్ చేసే ప్రయత్నం చేసినా.. అతడిని కాపాడలేకపోయారు. ఈ ఘటన మీద ఎస్సై రాజారెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలియాలి. 

PREV
click me!

Recommended Stories

నేషనల్ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ | Telangana CM Revanth Reddy Pressmeet
నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు | Asianet News Telugu