హైదరాబాద్ లో ఇద్దరు బాలికలు మిస్సింగ్... చెరువుగట్టుపై స్కూల్ బ్యాగ్స్... అసలేం జరిగింది?

Arun Kumar P   | Asianet News
Published : Mar 06, 2022, 11:01 AM ISTUpdated : Mar 06, 2022, 11:17 AM IST
హైదరాబాద్ లో ఇద్దరు బాలికలు మిస్సింగ్... చెరువుగట్టుపై స్కూల్ బ్యాగ్స్... అసలేం జరిగింది?

సారాంశం

ఇద్దరు పదోతరగతి విద్యార్థినుల మిస్సింగ్ తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కలకలం రేపుతోంది. ఇద్దరి బ్యాగులు చెరువుగట్టుపై లభించడంతో తల్లిదండ్రుల ఆందోళన మరింత పెరిగింది. 

హైదరాబాద్: ఇద్దరు బాలికల మిస్సింగ్ (school girls missing) హైదరాబాద్ (hyderabad) లో కలకలం రేపుతోంది. శనివారం ఉదయం స్కూల్ కు వెళుతున్నామని ఇంట్లోంచి బయటకు వెళ్లిన ఇద్దరు బాలికలు కనిపించకుండా పోగా ఇప్పటివరకు వారి ఆఛూకీ లభించలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 

జీడిమెడ్ల పరిధిలోని సూరారం కాలనీకి చెందిన మౌనిక, గాయత్రి స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. వీరిద్దరూ శనివారం ఉదయం స్కూల్ కి వెళ్లి సాయంత్రమైనా తిరిగిరాలేదు. దీంతో ఆందోళన చెందిన ఇద్దరు బాలికల తల్లిదండ్రులు స్కూల్ తో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినా బాలికల ఆచూకీ లభించలేదు.   

ఈ క్రమంలోనే విద్యార్థునులిద్దరి స్కూల్ బ్యాగ్స్ సూరారం చెరువుగట్టుపై లభించాయి. కానీ అక్కడెక్కడా బాలికలు కనిపించలేదు. దీంతో తల్లిదండ్రుల ఆందోళన మరింత పెరగడంతో పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కూడా బాలికల కోసం గాలింపు ప్రారంభించారు.

బాలికలు బ్యాగులను చెరువుగట్టుపై విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్లారా లేక ఏదయినా జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దిశగానే పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు కనిపించకపోయిన తమ బిడ్డల కోసం తల్లిదండ్రులు వెతుకులాట కొనసాగుతోంది. వారి ఆచూకీ కోసం ఇంకా బంధువులు, స్నేహితులను ఆరా తీస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

PM Modi: పెళ్లి కోసం ప్లాన్ మార్చుకున్న మోదీ.. 18 కిలోమీటర్లు రోడ్డుపైనే ప్రయాణం.. వైరలవుతున్న ప్రధాని నిర్ణయం!
CM REvanth reddy Speech: అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| PM Modi