వరంగల్‌ హైవేపై ఢీ కొన్న ఆర్టీసీ బస్సులు, డ్రైవర్ల పరిస్థితి విషమం..

Published : Jan 13, 2021, 12:20 PM IST
వరంగల్‌ హైవేపై ఢీ కొన్న ఆర్టీసీ బస్సులు, డ్రైవర్ల పరిస్థితి విషమం..

సారాంశం

పండగపూట జాతీయ రహదారి మీద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఎదురెదురుగా వచ్చి ఒకదానితో ఒకటి ఢీ కొన్నాయి.  కరీంనగర్ - వరంగల్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. దీంతో భోగీ రోజు ఆనందంగా గడపాల్సిన వారంతా ప్రమాదానికి గురై ఆస్పత్రి పాలయ్యారు. 

పండగపూట జాతీయ రహదారి మీద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఎదురెదురుగా వచ్చి ఒకదానితో ఒకటి ఢీ కొన్నాయి.  కరీంనగర్ - వరంగల్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. దీంతో భోగీ రోజు ఆనందంగా గడపాల్సిన వారంతా ప్రమాదానికి గురై ఆస్పత్రి పాలయ్యారు. 

వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ వద్ద ఉన్న ఈ జాతీయ రహదారిపై రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 24మందికి తీవ్ర గాయాలయ్యాయి. 12 మందిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

కాగా.. ఈ ఘటనలో రెండు ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
 

PREV
click me!

Recommended Stories

Heat Wave Alert : అసలుసిసలైన ఎండలు షురూ.. ఈ జిల్లాల్లో ఏకంగా 40 డిగ్రీలు, ఎల్లో అలర్ట్
పేమెంట్ అయిన‌ట్లు సౌండ్ వ‌స్తుంది కానీ డ‌బ్బులు ప‌డ‌వు.. ఫోన్‌పేలో కొత్త స్కామ్‌. జాగ్ర‌త్త‌!