కోడిగుడ్డు కోసం గొడవ: యువకుడిని చితకబాదిన రౌడీషీటర్లు

By Siva KodatiFirst Published Apr 2, 2019, 10:15 AM IST
Highlights

నిజామాబాద్‌లో రౌడీషీటర్లు రెచ్చిపోయారు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఓ యువకుడిని సీసాలతో చితకబాదారు. నగరంలోని కోటగల్లికి చెందిన రాజు అనే యువకుడు స్థానిక సూపర్‌ మార్కెట్‌లో కోడిగుడ్డు కొనే విషయంలో అతనితో ఇద్దరు వ్యక్తులు గొడవ పడ్డారు

నిజామాబాద్‌లో రౌడీషీటర్లు రెచ్చిపోయారు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఓ యువకుడిని సీసాలతో చితకబాదారు. నగరంలోని కోటగల్లికి చెందిన రాజు అనే యువకుడు స్థానిక సూపర్‌ మార్కెట్‌లో కోడిగుడ్డు కొనే విషయంలో అతనితో ఇద్దరు వ్యక్తులు గొడవ పడ్డారు.

ఈ క్రమంలో కోపంతో ఊగిపోయిన ఇద్దరు రౌడీషీటర్లు రాజుపై దాడికి దిగారు. పక్కనే ఉన్న కూల్‌డ్రింక్ సీసాలతో విచక్షణారహితంగా కొట్టారు. తీవ్ర రక్తస్రావం కావడంతో రాజును ఆస్పత్రికి తరలించారు. నిందితులపై హత్యాయత్నం కేసును నమోదు చేశారు పోలీసులు. కాగా ఈ సంఘటనతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. 

click me!