
తెలంగాణలో మరో రెండు కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కామారెడ్డి జిల్లాలో ఉన్న మాచారెడ్డి మండలంలోని 9 గ్రామాలను, అలాగే రామారెడ్డి మండలంలోని ఒక గ్రామాన్ని తీసుకొని కొత్తగా ‘పల్వంచ’ మండలంగా ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో కామారెడ్డి జిల్లాలో మండలాల సంఖ్య 24కు చేరింది.
అతిక్, అష్రఫ్ హత్య కేసు.. ముగ్గురు షూటర్లకు 4 రోజుల కస్టడీ విధించిన ప్రయాగ్ రాజ్ కోర్టు
దీంతో పాటు జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న ఇటిక్యాల మండలంలో నుంచి తొమ్మిది గ్రామాలను వేరు చేస్తూ కొత్తగా ‘ఎర్రవల్లి’ అనే మండలాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఇటు కామారెడ్డి జిల్లాలో, అటు జోగులాంబ గద్వాల జిల్లాల్లో కొత్త మండలాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.