
నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టాటా మ్యాజిక్ వాహనంపై భారీ వృక్షం పడిపోయింది. ఈ ఘటనలో టాటా మ్యాజిక్ వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను జగిత్యాల జిల్లా ఇటిక్యాలకు చెందిన వారిగా గుర్తించారు. వీరు కుంటాలకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఇక, గత రెండు రోజులుగా ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారీ వృక్షం నెలకొరిగినట్టుగా తెలుస్తోంది.