హైదరాబాద్: ఆటోను ఢీకొన్న లారీ.. ఇద్దరు చిన్నారుల దుర్మరణం, నలుగురి పరిస్ధితి విషమం

Siva Kodati |  
Published : Sep 08, 2022, 06:22 PM ISTUpdated : Sep 08, 2022, 06:30 PM IST
హైదరాబాద్: ఆటోను ఢీకొన్న లారీ.. ఇద్దరు చిన్నారుల దుర్మరణం, నలుగురి పరిస్ధితి విషమం

సారాంశం

హైదరాబాద్‌‌లోని చర్లపల్లి వద్ద స్కూల్ ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం పాలవ్వగా మరో నలుగురి పరిస్ధితి విషమంగా వుంది.  

హైదరాబాద్‌‌లోని చర్లపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. స్కూల్ ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం పాలవ్వగా మరో నలుగురి పరిస్ధితి విషమంగా వుంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతులు నారాయణ, శ్రీచైతన్య, రవీంద్ర భారతి స్కూల్ విద్యార్ధులుగా తెలుస్తోంది. వీరంతా ఈసీఐఎల్ నుంచి చర్లపల్లి వైపు వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave: వ‌చ్చే 4 రోజులు చుక్క‌లే.. గ‌జ‌గ‌జ వ‌ణకాల్సిందే. ఎల్లో అల‌ర్ట్
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?