భర్తను చంపిన నాగర్ కర్నూలు స్వాతి కేసులో ట్విస్ట్

Published : Aug 06, 2018, 02:41 PM IST
భర్తను చంపిన నాగర్ కర్నూలు స్వాతి కేసులో ట్విస్ట్

సారాంశం

ప్రియుడి కోసం భర్తను చంపిన నాగర్ కర్నూలు స్వాతి కేసు మలుపు తిరిగింది. ఇద్దరు జామీను ఇవ్వడంతో ఆమె ఇటీవల జైలు నుంచి విడుదలైంది.

హైదరాబాద్: ప్రియుడి కోసం భర్తను చంపిన నాగర్ కర్నూలు స్వాతి కేసు మలుపు తిరిగింది. ఇద్దరు జామీను ఇవ్వడంతో ఆమె ఇటీవల జైలు నుంచి విడుదలైంది. అయితే, ఆ ఇద్దరు వ్యక్తులు కూడా తాము ఇచ్చిన జామీనును వెనక్కి తీసుకున్నారు.

బెయిల్ లభించిన స్వాతిని తీసుకుని వెళ్లడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆమెను స్టేట్ హోమ్ కు తరలించారు. అయితే, తాము ఇచ్చిన జామీనును ఉపసహరించుకోవడంతో ఆమె భవిష్యత్తు మరోసారి అయోమయంలో పడింది.

జైలు నుంచి బయటకు వచ్చిన ఆమె తన పిల్లలతో ఉందామని అనుకుంది. అయితే, అందుకు వీలు లేకుండా పోయింది. కుటుంబ సభ్యులు ఆమెను స్వీకరించడానికి సిద్ధంగా లేరు. కోర్టులో ఆమె కన్నీరు మున్నీరుగా విలపించింది. కేసు విచారణ ఆగస్టు 7వ తేదీకి వాయిదా పడింది. ఆమె తిరిగి జైలుకు వెళ్తుందా, ఏమవుతుందనే తేలే అవకాశాలున్నాయి.  

PREV
click me!

Recommended Stories

Telangana New Airports: హైదరాబాద్ వెళ్లక్కర్లేదు.. తెలంగాణలో మరో 3 జిల్లాలకు ఎయిర్‌పోర్ట్‌లు.. ఈ ప్రాంతాల రూపురేఖలు ఛేంజ్
శ్రీ సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ | Asianet News Telugu