మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో పట్టపగలు మహేష్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో పట్టపగలు మహేష్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. యువతిపై వేధింపులకు పాల్పడటంతోనే ఆమె కుటుంబ సభ్యులు మహేష్ను హత్య చేసినట్టుగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ యువతి పెళ్లైనా తర్వాత కూడా మహేష్తో వీడియో కాల్లో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది.
ఆ వీడియోలో యువతి.. తన భర్త దగ్గర సంతోషంగా లేనని మహేశ్కు చెప్పింది. తన భర్త ఎప్పుడూ కొడుతున్నాడని తెలిపింది. తనను అనేక రకాలుగా దూషిస్తున్నాడని పేర్కొంది. ఐదేళ్లు తాను చెప్పినట్టుగా విన్నావని.. అప్పుడు హ్యాపీగా ఉన్నాం కదా అంటూ మహేష్తో చెప్పింది. తాను అన్యాయం చేయనని రెండేళ్లు వెయిట్ చేయమని మహేష్ను కోరింది.
అయితే ఈ విషయంలో మహేష్ తప్పేం లేదని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మహేష్, యువతి ఐదేళ్లుగా ప్రేమించుకున్నారని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు కూడా తెలుసునని చెబుతున్నారు. కానీ యువతికి మరో వ్యక్తితో పెళ్లి చేశారని చెప్పారు. పెళ్లైనా తర్వాత కూడా యువతి తన కొడుకుకు ఫోన్ చేసిందని తెలిపారు. ఆమె భర్త వేధిస్తున్నాడని.. మహేష్తోనే ఉంటానని యువతి చెప్పిందని తెలిపారు. మహేష్తో మాట్లాడిన న్యూడ్ వీడియో కాల్ వీడియోలను యవతే ఆమె భర్తకు పంపమని చెప్పింది అని ఆరోపించారు. గతంలోనూ కనకయ్య కుటుంబం మహేష్పై దాడి చేసిందని ఆరోపించారు. ఇందుకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని చెబుతున్నారు.
అసలేం జరిగిందంటే.. నజీర్పల్లి గ్రామానికి చెందిన మహేష్ లారీ డ్రైవర్ పనిచేస్తూ పాలు అమ్ముతున్నాడు. అతడు ఇందారం గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించారు. ఇద్దరు ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నారని చెబుతున్నారు. అయితే యువతికి ఏడాది క్రితం నస్పూర్ గ్రామానికి చెందిన యువకుడితో ఆమె కుటుంబ సభ్యులు వివాహం జరిపించారు. ఆ తర్వాత మహేష్, యువతితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. ఈ క్రమంలోనే యువతికి ఆమె భర్త విడాకులు ఇచ్చారు. అయితే కొంతకాలం త్వరాత యువతి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత యువతి ఇందారంకు వచ్చి తన తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. ఈ నేపథ్యంలో యువతి, మహేశ్ కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. తన కుమార్తె మొబైల్ ఫోన్కు కొన్ని నెలలుగా అసభ్యకరమైన సందేశాలు పంపినందుకు మహేష్పై యువతి తండ్రి గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మంగళవారం ఉదయం రోడ్డుపై వెళ్తున్న మహేష్పై దాడి చేసిన యువతి కుటుంబ సభ్యులు.. అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు స్థానికులు ఫోన్లలో వీడియో తీశారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహేష్ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు.
ఇక, మహేశ్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యువతి కుటుంబ సభ్యులపై నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మహేష్ సోషల్ మీడియాలో అశ్లీల సందేశాలు పంపుతూ యువతిని మానసిక వేదనకు గురిచేశాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే మహేష్ కుటుంబ సభ్యులు ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.