వారణాసిలో నామినేషన్ల తిరస్కరణ: ఈసీకి తెలంగాణ రైతుల ఫిర్యాదు

Published : May 03, 2019, 02:54 PM IST
వారణాసిలో నామినేషన్ల తిరస్కరణ: ఈసీకి తెలంగాణ రైతుల ఫిర్యాదు

సారాంశం

తమ నామినేషన్ల తిరస్కరించడంతో  వారణాసి ఎన్నికల రిటర్నింగ్  అధికారి తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ, తమిళనాడు రైతులు శుక్రవారం నాడు ఫిర్యాదు చేశారు.    

నిజామాబాద్: తమ నామినేషన్ల తిరస్కరించడంతో  వారణాసి ఎన్నికల రిటర్నింగ్  అధికారి తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ, తమిళనాడు రైతులు శుక్రవారం నాడు ఫిర్యాదు చేశారు.  

వారణాసిలో ఎన్నికల అధికారులు తాము నామినేషన్లు దాఖలు చేసే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పసుపు రైతులు ఫిర్యాదు చేశారు. నామినేషన్లు దాఖలు చేసిన 24 మంది రైతుల నామినేషన్లను కూడ ఎన్నికల అధికారులు తిరస్కరించారు. 

బీజేపీ నేతలు, పోలీసులతో పాటు ఎన్నికల అధికారులు కూడ తాము నామినేషన్లు వేయకుండా  అడ్డుకొన్నారని పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు నరసింహనాయుడు ఆరోపించారు.  పసుపు బోర్డును నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తోనే తాము వారణాసిలో నామినేషన్లు వేశామని ఆయన చెప్పారు.

వారణాసిలో తాము అడుగుపెట్టిన సమయం నుండి  నామినేషన్ల తిరస్కరణ వరకు చోటు చేసుకొన్న పరిణామాలను కేంద్ర ఎన్నికల సంఘానికి  పసుపు రైతులు ఫిర్యాదు చేశారు.
 

PREV
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.