నిజామాబాద్‌లో ఇద్దరు యువకుల అనుమానాస్పద మృతి

Published : May 03, 2019, 02:41 PM IST
నిజామాబాద్‌లో  ఇద్దరు యువకుల అనుమానాస్పద మృతి

సారాంశం

నిజామాబాద్‌ పట్టణంలోని  కంఠేశ్వర్ నగర్‌లో  ఇద్దరు యువకులు హత్యకు గురయ్యారు.ఈ ఘటన పట్టణంలో సంచలనం రేపుతోంది. నాలుగు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకొందని పోలీసులు అనుమానిస్తున్నారు.

నిజామాబాద్: నిజామాబాద్‌ పట్టణంలోని  కంఠేశ్వర్ నగర్‌లో  ఇద్దరు యువకులు హత్యకు గురయ్యారు.ఈ ఘటన పట్టణంలో సంచలనం రేపుతోంది. నాలుగు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకొందని పోలీసులు అనుమానిస్తున్నారు.

శ్రీకాంత్, మహేష్, సాయి అనే యువకులు కంఠేశ్వర్  నగర్‌లోని ఓ గదిని అద్దెకు తీసుకొని జీవిస్తున్నారు. ఈ ముగ్గురు సమీపంలోని ఓ టీ స్టాల్‌ను నడుపుతున్నారు.ఈ ఇద్దరిని శ్రీకాంత్ హత్య చేశాడా.. ఇంకా ఎవరైనా  ఈ ఘటనకు పాల్పడి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 ఓ ఇంటి నుండి దుర్వాసన రావడంతో  స్తానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.  ఈ సమాచారం ఆధారంగా ఆ ఇంటి తలుపులు పగుల గొట్టి చూస్తే రెండు మృతదేహాలు రక్తపు మడుగులో ఉన్నాయి.పోలీసులు డాగ్ స్క్వాడ్ తో ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad: ఇక ఊపిరి పీల్చుకోండి.. రూ. 700 కోట్ల‌తో భారీ ఫ్లై ఓవ‌ర్‌. ఈ ప్రాంతంలో ఊహించ‌ని మార్పు
Indian Air Force Jobs : కేవలం తెలుగు యువతకు మాత్రమే.. ఇంటర్ అర్హతతోనే భారత వాయుసేనలో ఉద్యోగావకాశాలు