నిజామాబాద్‌లో ఇద్దరు యువకుల అనుమానాస్పద మృతి

Published : May 03, 2019, 02:41 PM IST
నిజామాబాద్‌లో  ఇద్దరు యువకుల అనుమానాస్పద మృతి

సారాంశం

నిజామాబాద్‌ పట్టణంలోని  కంఠేశ్వర్ నగర్‌లో  ఇద్దరు యువకులు హత్యకు గురయ్యారు.ఈ ఘటన పట్టణంలో సంచలనం రేపుతోంది. నాలుగు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకొందని పోలీసులు అనుమానిస్తున్నారు.

నిజామాబాద్: నిజామాబాద్‌ పట్టణంలోని  కంఠేశ్వర్ నగర్‌లో  ఇద్దరు యువకులు హత్యకు గురయ్యారు.ఈ ఘటన పట్టణంలో సంచలనం రేపుతోంది. నాలుగు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకొందని పోలీసులు అనుమానిస్తున్నారు.

శ్రీకాంత్, మహేష్, సాయి అనే యువకులు కంఠేశ్వర్  నగర్‌లోని ఓ గదిని అద్దెకు తీసుకొని జీవిస్తున్నారు. ఈ ముగ్గురు సమీపంలోని ఓ టీ స్టాల్‌ను నడుపుతున్నారు.ఈ ఇద్దరిని శ్రీకాంత్ హత్య చేశాడా.. ఇంకా ఎవరైనా  ఈ ఘటనకు పాల్పడి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 ఓ ఇంటి నుండి దుర్వాసన రావడంతో  స్తానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.  ఈ సమాచారం ఆధారంగా ఆ ఇంటి తలుపులు పగుల గొట్టి చూస్తే రెండు మృతదేహాలు రక్తపు మడుగులో ఉన్నాయి.పోలీసులు డాగ్ స్క్వాడ్ తో ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి