Telangana: కావాలనే టీఆర్ఎస్ దుర్మార్గపు తప్పుడు ప్రచారం..కేసీఆర్‌పై కిష‌న్ రెడ్డి విమ‌ర్శ‌లు

Published : Apr 24, 2022, 11:42 AM IST
Telangana: కావాలనే టీఆర్ఎస్ దుర్మార్గపు తప్పుడు ప్రచారం..కేసీఆర్‌పై కిష‌న్ రెడ్డి విమ‌ర్శ‌లు

సారాంశం

Telangana: భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ), కేంద్రం పై తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్‌) త‌ప్పుడు ప్ర‌చారం చేస్తోంద‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ఆరోపించారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుటుంబం ప్ర‌ణాళిక ప్ర‌కారం.. బీజేపీ, కేంద్రంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నార‌న్నారు.   

Kishan Reddy: గ‌త కొంత కాలంగా రాష్ట్రంలో బీజేపీ దూకుడుగా ముందుకు సాగుతోంది. మ‌రోవైపు కేంద్రంలోనీ ప్ర‌ధాని మోడీ స‌ర్కారు తెలంగాణ న్యాయంగా అందాల్సిన నిధులు ఇవ్వ‌డం లేద‌ని తెలంగాణ స‌ర్కారు పేర్కొంటోంది. ధాన్యం కొనుగోలు విష‌యంలో కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య పొలిటిక‌ల్ వార్ మ‌రింత‌గా ముదిరింది. ఈ నేప‌థ్యంలోనే ఇరు పార్టీల నేతలు ఒక‌రిపై ఒక‌రు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించుకుంటున్నారు. తాజాగా కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర రావు (కేసీఆర్‌) నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్‌) స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణ‌పై కేంద్రంలోని ఎన్డీయే ప్ర‌భుత్వం ఎలాంటి వివ‌క్ష‌ను చూపించ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు. 

తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్ స‌ర్కారు.. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై వివక్షను చూపుతోందని కేంద్ర మంత్రి జి కిషన్ ఆరోపించారు. కావాల‌నే త‌ప్పుడు ప్ర‌చారం చేస్తోంద‌ని పేర్కొన్నారు. "వారు మా ప్రభుత్వంపై తప్పుడు మరియు దుర్మార్గపు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు… ప్రతిరోజూ, ఒక ప్రణాళిక ప్రకారం.. వారు భార‌తీయ జ‌న‌తా పార్టీ పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ (ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు) కుటుంబం కేంద్ర ప్రభుత్వం పరువు తీసేందుకు ప్రయత్నిస్తోంది" అని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం చేస్తున్న సహకారంపై టీఆర్‌ఎస్‌ ప్రశ్నించడాన్ని ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పీఎస్‌యూలు, రక్షణ రంగానికి సంబంధించిన కార్యకలాపాలు కొన‌సాగ‌డం లేదా? అని కిష‌న్ రెడ్డి ప్ర‌శ్నించారు. 

తెలంగాణలో ఒక్క రూపాయికే కిలో బియ్యం పథకంలో కేంద్రం వాటా రూ.32 కాగా, రాష్ట్ర ప్రభుత్వ సహకారం రెండు రూపాయలు అని కిష‌న్ రెడ్డి పేర్కొన్నారు. "కేసీఆర్ (ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు) కుటుంబం పథకం ప్రకారం మంత్రుల అధికారాల‌ను దుర్వినియోగం చేస్తోంది. ఎలాంటి భాష వాడాలో రాతపూర్వకంగా ఇస్తున్నారు. బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని, ప్ర‌ధాని నరేంద్ర మోడీ జీని దూషించడం, దుర్భాషలాడడం వంటివి అందులో ఉంటున్నాయి" అని ఆయన ఆరోపించారు. కేంద్రంలోని ప్ర‌ధాని మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేకి అన్న టీఆర్‌ఎస్ ఆరోపణలను ప్రస్తావిస్తూ.. గత ఎనిమిదేళ్లలో వరి సేకరణపై ఎన్డీఏ ప్రభుత్వం, టీఆర్‌ఎస్ ప్రభుత్వం వరుసగా ఖర్చు చేసిన నిధులపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నాన‌నీ, మీరు రెడీనా? అంటూ కిష‌న్ రెడ్డి స‌వాలు విసిరారు. జాతీయ రహదారులు, ఒక్క రూపాయికే కిలో బియ్యం సహా పలు అంశాలపై చర్చకు రావాలని టీఆర్‌ఎస్‌కు సవాల్ విసిరారు.

మరోవైపు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ పాదయాత్రలో చేసిన వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తెలంగాణకు రావాల్సిన నిధులను కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లు, ఇతర అంశాలపై టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రెడ్డి, హరీశ్‌రావు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తెలంగాణలో వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఇప్ప‌టికే రాష్ట్రంలోని ప్ర‌ధాన పార్టీలైన టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు దాడి పెంచ‌డంతో పొలిటిక‌ల్ హీట్ క్ర‌మంగా పెరుగుతోంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!