టీఆర్ఎస్ రెబల్ నాయకుడి రోడ్ షో.. అనూహ్య స్పందన

Published : Oct 13, 2018, 11:39 AM ISTUpdated : Oct 13, 2018, 11:56 AM IST
టీఆర్ఎస్ రెబల్ నాయకుడి రోడ్ షో.. అనూహ్య స్పందన

సారాంశం

త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో స్వతంత్య్ర అభ్యర్థిగా ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయన చేపట్టిన రోడ్ షోకి అనూహ్య స్పందన లభించింది. 

టికెట్ ఇస్తానని ఆశపెట్టి..తనను కేసీఆర్ మోసం చేశాడని.. టీఆర్ఎస్ రెబల్ నేత, స్వతంత్య్ర అభ్యర్థి గండ్ర సత్యనారాయణ ఆరోపించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో స్వతంత్ర్య అభ్యర్థిగా ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయన చేపట్టిన రోడ్ షోకి అనూహ్య స్పందన లభించింది. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నియోజకవర్గంలో ఇంతవరకు సాగిన అవినీతి పాలనను ఇక ప్రజలు బొందపెట్టాలన్నారు. ఇంతకాలం అసమర్థులు నియోజకవర్గాన్ని పాలించి ప్రజల బతుకులతో ఆడుకున్నారని ఆయ న విమర్శించారు. నియోజకవర్గంలో ఉన్న ఆరు మండలాలను ముగ్గురు కొడుకులతో కలిసి స్పీకర్‌ లూటీ చేయించారన్నారు.
 
ప్రజా సేవ చేసుకుంటూ ప్రజల్లో ఉంటున్న తనను గుర్తించిన కేసీఆర్‌ తన కొడుకు కేటీఆర్‌, అల్లుడు హరీష్‌రావు, వినోద్‌కుమార్‌లు నావద్దకు పంపించి భూపాలపల్లి ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇస్తానని నమ్మబలికారన్నారు. పట్టుబట్టి నన్ను పార్టీలోనికి తీసుకొచ్చి సీటు ఇవ్వకుండా దారుణంగా మోసం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?