టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం...తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేసీఆర్

Published : Aug 13, 2018, 04:34 PM ISTUpdated : Sep 09, 2018, 11:30 AM IST
టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం...తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేసీఆర్

సారాంశం

టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో ఇవాళ తలపెట్టిన రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై సీఎం కేసీఆర్ పార్టీ నాయకులతో చర్చించనున్నారు. ఈ సమావేశం కోసం తెలంగాణ భవన్ లో భారీ ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ కు చేరుకోవడంతో ఈ సమావేశం ప్రారంభమైంది.

టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో ఇవాళ తలపెట్టిన రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై సీఎం కేసీఆర్ పార్టీ నాయకులతో చర్చించనున్నారు. ఈ సమావేశం కోసం తెలంగాణ భవన్ లో భారీ ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ కు చేరుకోవడంతో ఈ సమావేశం ప్రారంభమైంది.

టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో ఈ కార్యవర్గ సమావేశానికి సీఎం కేసీఆర్ అధ్యక్షత వహించనున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు వంటి బృహత్తర కార్యక్రమాలను చేపట్టడంతో పాటు భవిష్యత్ లో రైతులు, ప్రజల సంక్షేమం కోసం మరిన్ని పథకాలను తీసురానున్నట్లు ప్రకటించింది.  ఈ నెల 15 నుండి రైతు భీమా పథకం, కంటి వెలుగు వంటి పథకాలు ప్రారంభం కానున్నాయి. వీటి ద్వారా ప్రజలకు మేలు చేయడమే కాకుండా, ప్రభుత్వానికి, టీఆర్ఎస్ పార్టీకి మంచి పేరు తీసుకురావాలని సీఎం చూస్తున్నారు. అందుకోసం ఈ పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకుపోవాలి, ప్రచారం ఎలా కల్పించాలన్న దానికి కేసీఆర్ పార్టీ నాయకులతో చర్చించనున్నారు.

అంతే కాంకుండా తాజా రాజకీయ పరిణాలపై కూడా ఈ సమావేశంలో నాయకులతో సీఎం చర్చించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు,పార్టీ సీనియర్
నాయకులు  హాజరయ్యారు.
 

PREV
click me!

Recommended Stories

ట్రంప్ మెచ్చిన తెలుగు మహిళ.. US పాలిటిక్స్ లో సంచలనం | Saritha Komatireddy | Donald Trump
Weather Update: 5 తుపాన్లు.. మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో 4 రోజులు భారీ వర్షాలు.. ఏ ఏ జిల్లాల్లో అంటే?