సాంస్కృతిక సారథి ఛైర్మన్ పదవి మళ్లీ రసమయికే... కేసీఆర్ కీలక నిర్ణయం

Arun Kumar P   | Asianet News
Published : Jul 14, 2021, 10:04 AM ISTUpdated : Jul 14, 2021, 10:20 AM IST
సాంస్కృతిక సారథి ఛైర్మన్ పదవి మళ్లీ రసమయికే... కేసీఆర్ కీలక నిర్ణయం

సారాంశం

తెలంగాణ కళాకారుల కోసం ఏర్పాటుచేసిన సాంస్కృతిక సారథి సంస్థ ఛైర్మన్ గా మరోసారి నియమితులయ్యారు టీఆర్ఎస్ మానుకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. 

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన కళాకారుల కోసం కేసీఆర్ సర్కార్ తెలంగాణ సాంస్కృతిక సారథి సంస్థను ఏర్పాటుచేసింది. 2015 చివర్లో ఈ సంస్థ ఛైర్మన్ గా స్వతహాగా కళాకారుడయిన మానుకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నియమించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన పదవీకాలం ముగియగా తిరిగి సాంస్కృతిక సారథి సంస్థ చైర్మన్ గా పునర్నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవీలో బాలకిషన్ మరో మూడేళ్లపాటు కొనసాగనున్నారు.

హైకోర్టులో కేసుల కారణంగా కొంతకాలం సాంస్కృతిక సారథి సంస్థ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇటీవల అవి పరిష్కారం కావడంతో తాజాగా ఆ సంస్థ ఛైర్మన్ గా తిరిగి బాలకిషన్ ను నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 

read more  జగన్ బాటలో కేసీఆర్: ఇకపై ఏటా జాబ్ క్యాలెండర్, కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం

తనను సాంస్కృతిక సారథి ఛైర్మన్ గా తిరిగి నియమిస్తూ ఉత్తర్వులు వెలువడిన వెంటనే రసమయి ప్రగతిభవన్ కు వెళ్లి సీఎంను కలిశారు. ఈ సందర్భంగా తనకు మరోసారి అవకాశమిచ్చిన కేసీఆర్ కు పుష్పగుచ్చం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చేతులమీదుగానే ఎమ్మెల్యే రసమయి నియామక పత్రాన్ని అందుకున్నారు.

ఈ క్రమంలోనే కళాకారుల సంక్షేమం కోసం పాటుపడుతున్న  రసమయిని సీఎం కేసీఆర్ అభినందించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలకు సంబంధించిన సమాచారాన్ని మారుమూల ప్రాంతాలకు చేరవేయడంలో సాంస్కృతిక సారథి కీలకంగా వ్యవహరించాలని కేసీఆర్‌ సూచించారు.
 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్