నా సభకు రానోళ్లకి పెన్షన్లు ఇవ్వొద్దు : టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Sep 03, 2022, 03:25 PM IST
నా సభకు రానోళ్లకి పెన్షన్లు ఇవ్వొద్దు : టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

తుంగతుర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన సభకు రానివాళ్లకు పెన్షన్లు ఇవ్వొద్దంటూ గ్రామ కార్యదర్శికి ఆయన హుకుం జారీ చేశారు. 

తుంగతుర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాలలో జరిగిన ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక కార్యదర్శిపై ఆయన నోరు జారారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి కొందరు లబ్ధిదారులు రాకపోవడంపై ఎమ్మెల్యే గాదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి వచ్చిన వారికి మాత్రమే పెన్షన్లు ఇవ్వాలని కార్యదర్శికి సూచిస్తూ దురుసుగా మాట్లాడారు. ఎమ్మెల్యే పరుష పదజాలం ఉపయోగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

School Holidays : ఆగస్ట్ ముగిసినా ఆగని సెలవులు.. సెప్టెంబర్ లో స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులకు వచ్చే వరుస సెలవులు, లాంగ్ వీకెండ్స్ ఇవే
Weather Update: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు