
Allola Indrakaran Reddy : తెలంగాణ రైతాంగం ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం.. కేంద్రంపై పోరుకు సిద్ధమైందని రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. దీనిలో భాగంగా కేంద్ర తీరును పై నిరసన తెలుపుతూ.. వరి పంటను సేకరించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పోరాటాన్ని ప్రారంభించిందని ఆయన స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు.
బుధవారం కడ్తాల్ గ్రామం వద్ద హైదరాబాద్-నాగ్పూర్ జాతీయ రహదారిపై నిర్వహించిన రాస్తారోకోలో ఆయన పాలుపంచుకున్నారు. అక్కడ కేంద్రంలోని ప్రధాని మోడీ బీజేపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగి సీజన్లో వరి పంటలను కొనుగోలు చేయరాదన్న కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ నినాదాలు చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించిన టీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులకు ఆయన సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వరిధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు టీఆర్ఎస్ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుందని పునరుద్ఘాటించారు. ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన భారతీయ జనతాపార్టీ నేతలు ప్రస్తుతం పంటలు పండక మొహం దాచుకుంటున్నారని అన్నారు. పంజాబ్ తరహాలో తెలంగాణ వరి కొనుగోళ్లు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్నిఆయన డిమాండ్ చేశారు.
ఉక్కపోతతో రైతులు వీధిన పడుతున్నందున కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రభావం ఏమిటో గుర్తించాలని మంత్రి కేంద్రానికి సూచించారు. రాష్ట్ర ప్రజలను కించపరిచినందుకు కేంద్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని, యాసంగి సీజన్లో వరి పంటలను త్వరగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వాహనదారులకు అసౌకర్యం కలిగించడం టీఆర్ఎస్కు ఎప్పటికీ ఇష్టం లేదని, అయితే రైతుల బాధను కేంద్రప్రభుత్వానికి అర్థం చేసుకునేందుకే ఈ నిరసనను చేపట్టామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు, ముధోలే ఎమ్మెల్యే జి.విట్టల్రెడ్డి, ఎమ్మెల్సీ దండే విట్టల్, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, రైతు సమన్వయ సమితి చైర్మన్ ఎన్.వెంకటరాంరెడ్డితోపాటు పలువురు నేతలు ఈ నిరసనల్లో పాల్గొన్నారు.
కాగా, గత రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదనీ, రాష్ట్రాన్ని న్యాయంగా అందాల్సిన నిధులను సైతం ఇవ్వడం లేదని గత కొంత కాలంగా కేంద్రంలోని బీజేపీ సర్కారుపై టీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనికి తోడు అనేక విషయాల్లో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని ఆరోపిస్తున్నది. అయితే, వరి ధాన్యం కొనుగోలు విషయం.. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరాన్ని మరింతగా పెంచింది. ఈ నేపథ్యంలోనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేటి నుంచి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని జాతీయ రహదారులను టీఆర్ఎస్ దిగ్భంధనం చేసింది. జాతీయ రహదారులపై టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, ఆ పార్టీ కార్యకర్తలు బైఠాయించి ఆందోళనక దిగారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 4వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించనున్నట్టుగా టీఆర్ఎస్ ప్రకటించింది. ఇప్పటికే మండల కార్యాలయాల్లో నిరసన దీక్షలను షురు చేసింది.