
న్యూఢిల్లీ: తాను వివాదాస్పద వ్యక్తిని కానని తెలంగాణ గవర్నర్ తమిళిపై సౌందర రాజన్ చెప్పారు. తాను అందరితో స్నేహంగానే ఉంటానని ఆమె స్పష్టం చేశారు.ప్రధాని Narendra Modi తో తెలంగాణ గవర్నర్ Tamilisai Soundararajan బుధవారం నాడు న్యూఢిల్లీలో భేటీ అయ్యారు.ఈ భేటీ ముగిసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. Governor గా తాను చట్ట ప్రకారంగానే నడుచుకొంటానని ఆమె తేల్చి చెప్పారు. తెలంగాణలో ఏం జరుగుతుందనేది అందరికీ తెలుసునన్నారు. ఈ విషయమై మీడియా కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తుందన్నారు.
Telanganaలో ఏం జరుగుతుందో ప్రధానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రధానికి అన్ని విషయాలు తెలుసన్నారు.తెలంగాణలో తాను అధికారం చెలాయించడం లేదన్నారు. గతంలో పాడి కౌశిక్ రెడ్డి పేరును గవర్నర్ కోటా కింద ప్రభుత్వం సిఫారసు చేసిన అంశంపై తాను విబేధించానన్నారు.
కౌశిక్ రెడ్డి అభ్యర్ధిత్వాన్ని తిరస్కరించినట్టుగా ఆమె చెప్పారు.కౌశిక్ రెడ్డి అర్హతలు సరిపోలేదన్నారు. అందుకే ఆయన అభ్యర్ధిత్వాన్ని తిరస్కరించినట్టుగా ఆమె గుర్తు చేశారు. ఈ విషయంలో ఎలాంటి రాజకీయం లేదని ఆమె స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని రాజ్ భవన్ గౌరవించాల్సి ఉంటుందన్నారు. రాజ్యాంగం ఏం చెబుతుందో దానిప్రకారమే తాను ముందుకు వెళ్తున్నానని గవర్నర్ తెలిపారు. గవర్నర్ కు గౌరవం ఇవ్వకపోవడాన్ని ప్రజలకే వదిలేస్తున్నామన్నారు.ప్రభుత్వం పంపిన ప్రతి అంశాన్ని చేయాల్సిన అవసరం లేదని గవర్నర్ చెప్పారు.
శాసనమండలిలో ప్రొటెం చైర్మెన్ విషయమై కూడా ప్రభుత్వ ప్రతిపాదనను తాను ప్రశ్నించాల్సి వచ్చిందన్నారు. రాజ్యాంగం ప్రకారంగా ఈ విషయమై తాను అడగాల్సి వచ్చిందన్నారు.తాను లేవనెత్తిన అంశాలపై ఏమైనా ఇబ్బందులుంటే సీఎం కానీ, మంత్రులు కానీ ఎప్పుడైనా తన ఆఫీస్ కు వచ్చి మాట్లాడొచ్చు కదా అని ఆమె ప్రశ్నించారు. ఏ విషయంపై అయినా సీఎంతో చర్చించేందుకు సిద్దంగా ఉన్నానన్నారు. అవసరమైతే బహిరంగ చర్చకు కూడా సిద్దమేనని ఆమె తేల్చి చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వంతోనూ కూడా సఖ్యతగానే ఉండే ప్రయత్నం చేశానన్నారు. రాజ్భవన్ ను గవర్నర్ ను అవమానించే ప్రయత్నాలు చేశారన్నారు. అయినా వాటిని తాను పట్టించుకోలేదన్నారు.తనకు ఇగో కూడా లేదని గవర్నర్ స్పష్టం చేసింది.ఏ చర్యలు కూడా తనను ఆపలేవన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, జిల్లాల కలెక్టర్లకు గవర్నర్ ప్రోటోకాల్ తెలియదా అని గవర్నర్ తమిళిసై ప్రశ్నించారు. ఉగాది సంబరాలకు కూడా సీఎం కేసీఆర్ కు ఆహ్వానం పంపినట్టుగా చెప్పారు. ఈ కార్యక్రమానికి రాలేని కొందరు తనకు ఫోన్ చేసి కొన్ని కారణాలు కూడా వివరించారని ఆమె గుర్తు చేసుకొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 11 శాతం గిరిజన జనాభా ఉన్నారన్నారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో తాను చేసిన పర్యటనకు సంబంధించి ప్రధాని మోడీతో చర్చించినట్టుగా చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో సుమారు 500 కి.మీ. పర్యటించానన్నారు. అంతేకాదు ఆదీవాసీల్లో అరుదైన చెంచులను కూడా తాను కలిశానని ఆమె గుర్తు చేసుకొన్నారు. అడవిలో దాదాపుగా 15 కి.మీ తిరిగి వారి సాధక బాధకాలను చూశానని గవర్నర్ వివరించారు.నాగర్కర్నూల్, భద్రాచలం జిల్లాల్లోని గిరిజన ప్రాంతాలను సందర్శించానన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ వల్లే ప్రజలంతా సురక్షితంగా ఉన్నారన్నారు.వ్యాక్సినేషన్ కార్యక్రమంపై కూడా ప్రధానితో చర్చించినట్టుగా తమిళిసై చెప్పారు.